
                      
						19 November 2021
                        Hyderabad
						కొత్త తరహా కథ లతో ప్రేక్షకులకు దగ్గరయిన గౌతమ్ హీరోగా కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాను ఎస్ ఒరిజినల్స్ పతాకంపై సృజన్ యరబోలు నిర్మించనున్నారు. ఒక యూనిక్ కాన్సెప్ట్ తో తెరకెక్క బోతున్న ఈ మూవీ తో  సుబ్బు చెరుకూరి దర్శకుడి గా పరిచయం కాబోతున్నారు. యస్ ఒరిజినల్స్ నిర్మాణం లో పదో సినిమా గా రూపొందుతున్న ఈ మూవీ  సర్వైవల్ థ్రిల్లర్ అనే  కొత్త కాన్సెప్ట్ ను తెర మీద పరిచయం చేయబోతుంది.
						మోనోఫోబియాతో బాధపడుతున్న ఒక అప్ కమింగ్  రచయిత తన జీవితానికి ప్రమాదం ఎర్పడినప్పుడు ఎలా వాటిని అధిగమించి బయటపడ్డాడు అనే కథాంశంతో సరికొత్త అనుభూతి ప్రేక్షకులకు ఇచ్చేలా ఈ సినిమా ఉండబోతోంది. శ్రీరామ్ మడ్డూరి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి కె సంతోష్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. మోహన్ చారి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
						గౌతమ్ హీరో గా రూపొందుతున్న ఈ మూవీ కి యస్ ఒరిజినల్స్ లో దర్శకుడి గా పరిచయం కాబోతున్న విశ్వ క్లాప్ ఇచ్చారు.
						ప్రొడ్యూసర్ : సృజన్ యారబోలు
						  రచన  దర్శకత్వం : సుబ్బు చెరుకూరి
						  సినిమాటోగ్రఫీ : మోహన్
						  మ్యూజిక్ :  శ్రీరామ్ మద్దూరి
						  ఎడిటర్ : కె. సంతోష్.
                      