అజయ్ కతుర్వా, మాయ, శివకుమార్ రామచంద్రవరప, వ్యాసకి, తనికెళ్ళభరణి, వెన్నెలకిశోర్ తదితరులు ప్రధాన తారాణంగా సిరి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్పై కొత్త చిత్రం `ప్రేమ దేశం` సోమవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ఆకాశ్ క్లాప్ కొట్టగా..ఆనంద్ రంగ గౌరవ దర్శకత్వం వహించారు.
ఆకాశ్ మాట్లాడుతూ - ``అజయ్ నాకు మంచి మిత్రుడు. ఇద్దరం కలిసి సినిమాలు చేశాం. తనకు ఈ సినిమా హీరోగా మంచి పేరు తేవాలి. మణిశర్మగారి సంగీతం అంటే సినిమా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఎంటైర్ యూనిట్కు అభినందనలు`` అన్నారు.
హీరో అజయ్ మాట్లాడుతూ - ``పూరిగారు నటుడిగా నాకు బ్రేక్ ఇచ్చారు. డిఫరెంట్ లవ్స్టోరీ. కొత్త కాన్సెప్ట్తో సాగుతుంది`` అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ - ``నీలిమ తిరుమల శెట్టిగారు కథ విని తన వంతు సపోర్ట్ అందించడానికి సిద్ధమయ్యారు. అలాగే మణిశర్మగారు సంగీతం అందించడానికి ఓకే చెప్పారు. సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది`` అన్నారు.