pizza
పొల్లాచ్చిలో రామ్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం
You are at idlebrain.com > News > Functions
Follow Us

01 April 2015
Hyderabad

రామ్ చాలా బిజీగా ఉన్నారు. ఇప్పటికే 'పండగ చేస్కో', 'శివమ్' చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో 'శివమ్' చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణచైతన్య సమర్పణలో 'స్రవంతి' రవికిశోర్ నిర్మిస్తున్నారు. రామ్ హీరోగా ఆయన నిర్మిస్తున్న మరో చిత్రం షూటింగ్ నేడు (ఏప్రిల్ 1) తమిళనాడులోని పొల్చాచ్చిలో ప్రారంభమైంది.

ఈ సందర్భంగా స్రవంతి రవికిశోర్ మాట్లాడుతూ - '''రఘువరన్ బీ టెక్' చిత్రానికి మంచి సంభాషణలు అందించిన కిశోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రామ్ సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. ఈ నెల 15 వరకు పొల్లాచ్చిలో షూటింగ్ చేస్తాం. ఈ షెడ్యూల్ లో ఒక పాట, కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తాం. ఇది మంచి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ. రామ్ కారెక్టర్ చాలా ఎనర్జిటిక్ గా ఉంటుంది'' అన్నారు.
సత్యరాజ్, ప్రదీప్ రావత్, నరేశ్, విజయ్ కుమార్, రోహిణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: సమీర్ రెడ్డి, ఫైట్స్: హరి దినేష్.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved