ఆది, రావు రమేశ్, రాధిక, అజయ్ ప్రధాన తారాణంగా.. డి.ఆర్.పి.వర్మ సమర్పణలో.. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ బ్యానర్పై కొత్త చిత్రం ఆదివారం ఉదయం హైదరాబాద్లో ప్రారంభమైంది. శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాస్, చావలి రామాంజనేయులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి వంశీ పైడిపల్లి క్లాప్ కొట్టగా ఆడిషన్ పోలీస్ కమీషనర్ శ్రీనివాస్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా...
హీరో ఆది మాట్లాడుతూ - ``చాలా రోజుల తర్వాత సినిమా చేయడం ఆనందంగా ఉంది. కొత్త బ్యానర్.. కొత్త దర్శకుడు. కథ బావుంది`` అన్నారు.
డైరెక్టర్ శ్రీనివాస్ నాయుడు నడికట్ల మాట్లాడుతూ ``దర్శకుడిగా అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్. హీరోగా నటిస్తున్న ఆదికి థాంక్స్`` అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ ``పదకొండేళ్ల ముందు మా బ్యానర్లో ఓ సినిమా చేశాం. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత తెలుగులో చేస్తున్న సినిమా. శ్రీనివాస్ నాయుడు బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేశారు. సుమారు వంద మందికి కథను వినిపించాం. అందరూ పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. ఆదిగారికి కూడా కథ వినిపించాం. ఆయనకు కూడా కథ బాగా నచ్చింది. సపోర్ట్ చేస్తున్న అందరికీ థాంక్స్`` అన్నారు.
ఆది, రావు రమేశ్, రాధిక, అజయ్, మిర్చి కిరణ్, ప్రియ, రాజీవ్ కనకాల తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాంబ భీమవరపు, సంగీతం: అరుణ్ చిలువేరు, ఎడిటింగ్: ఎస్.బి.ఉద్ధవ్, ఆర్ట్: టి.రాజ్కుమార్, నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాస్, చావలి రామాంజనేయులు, కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్ నాయుడు నడికట్ల.