pizza
Vajralu Kavala Nayanaa movie launch
ప్రారంభమైన 
వజ్రాలు కావాలా నాయనా
ou are at idlebrain.com > News > Functions
Follow Us

11 April 2016
Hyderabad

శ్రీ పాద ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై అనిల్, నేహ, నిఖిత ప్రధాన పాత్రల్లో నూతన చిత్రం వజ్రాలు కావాలా నాయనా సోమవారం  హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. పి.రాధాకృష్ణ దర్శకత్వంలో కిషోర్ కుమార్ కోట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహుర్తపు సన్నివేశానికి ప్రతాని రామకృష్ణ గౌడ్ క్లాప్ కొట్టగా, కిషోర్ కుమార్ కోట కెమెరా స్విచ్చాన్ చేశారు. ప్రతాని రామకృష్ణ గౌడ్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...

నిర్మాత కిషోర్ కుమార్ కోట మాట్లాడుతూ ‘’సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను జోడించి చేయబోయే సినిమా ఇది. నెలరోజుల పాటు జరిగే సింగిల్ షెడ్యూల్ లో సినిమా చిత్రీకరణను పూర్తి చేస్తాం. కొత్తవాళ్లను మా బ్యానర్ ద్వారా పరిచయం చేస్తున్నాం. జూలై మొదటి వారంలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.

దర్శకుడు రాధాకృష్ణ మాట్లాడుతూ ‘’దర్శకుడిగా నా తొలి చిత్రం. ఓ ఫేమస్ పాయింట్ తో కథను సిద్ధం చేశాను. కథ వినగానే నిర్మాతగారు వెంటనే సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. సినిమాలో ఎక్కువ భాగం కామెడి ఉంటుంది. మా ప్రయత్నాని ఆశీర్వదిస్తారని భావిస్తున్నాం’’ అన్నారు.

అనిల్ మాట్లాడుతూ ‘’నా క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’’ అన్నారు.

సినిమాలో అవకాశం కల్పించిన దర్శక  నిర్మాతలకు హీరోయిన్స్ నేహ, నిఖిత ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ చిత్రానికి సంగీతం: జాన్, కెమెరా: అమర్, ఆర్ట్: డేవిడ్, కథ, నిర్మాత: కిషోర్ కుమార్ కోట, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పి.రాధాకృష్ణ. 

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved