pizza
'అందాల చందమామ' సెన్సార్ పూర్తి..!
You are at idlebrain.com > News > Functions
Follow Us

05 June 2015
Hyderabad

మధులగ్న దాస్, ఐశ్వర్య, రమన్ లాల్ ప్రధాన పాత్రల్లో కె.ఎస్.మూర్తి దర్శకత్వంలో పి.డి.ఆర్.ప్రసాద్ రెడ్డి నిర్మించిన సినిమా 'అందాల చందమామ'. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు కె.ఎస్.మూర్తి మాట్లాడుతూ "ఓ మహిళకు అన్యాయం జరిగినప్పుడు భయపడకుండా దైర్యంగా ఆ అన్యాయాన్ని ఎదుర్కొంటే ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపించాం. ఈ సినిమా కోసం నాకు సహకరించిన ప్రతి ఆర్టిస్ట్ కు, టెక్నీషియన్ కు నా ధన్యవాదాలు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

పి.డి.ఆర్.ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ "ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకొంది. సెన్సార్ బోర్డు అధికారుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం" అని చెప్పారు.

మధులగ్న దాస్ మాట్లాడుతూ "ఇదొక లేడీ ఓరియెంటెడ్ మూవీ. ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఎలా పగ తీర్చుకుంటుందో అనేదే ఈ సినిమా" అని చెప్పారు.

ఐశ్వర్య మాట్లాడుతూ "తమిళం, కన్నడలో కొన్ని సినిమాలో నటించాను. నా మాతృభాష అయిన తెలుగులో మొదటిసారి నటించడం ఆనందంగా ఉంది" అని చెప్పారు.

రమన్ లాల్ మాట్లాడుతూ "ఈ సినిమాలో ఇన్స్ పెక్టర్ క్యారెక్టర్ లో నటించాను. సినిమా ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను" అని తెలిపారు.

ఈ చిత్రానికి కెమెరా: టి.రమేష్, సంగీతం: వై.సునీల్, ఎడిటింగ్: రేణుకా బాబు.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved