pizza
మే 15న విడుదలవుతున్న ‘రణం2’
You are at idlebrain.com > News > Functions
Follow Us

26 April 2015
Hyderabad


అమ్మరాజశేఖర్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘రణం2’. విక్టరీ ఇన్ ఫ్రా సమర్పణలో శ్రీ వెంకటేశ్వరా మూవీస్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై చిత్రం రూపొందుతోంది. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 15న విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో....

అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ ‘’ఇది ఒక ఫైర్ తో వస్తోన్న చిత్రం. రణం చిత్రం నేను డైరెక్టర్ ఎంటో ప్రూవ్ చేసిన మూవీ. అలాంటి ప్రాజెక్ట్ చేసిన నేను తర్వాత సినిమాలు చేసినా కొంత గ్యాప్ తీసుకుని సినిమాలు చేయలేదు. మంచి కథను తయారు చేసుకుని ఈ సినిమా చేశాను. రణం కంటే రణం2లో డబుల్ ఎంటర్ టైన్మెంట్ ఉంటుంది. అలాగే నిర్మాత శ్రీనివాసయాదవ్ గారు ఈ సినిమా కోసం మూడేళ్లు వెయిట్ చేశారు. ఆయన సహకారం మరువలేనిది. అలాగే నా మిత్రుడు పసుపలేటి కన్నమాంబ ఈ చిత్రాన్ని అన్నీ ఏరియాల్లో విడుదల చేయనున్నాడు. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ ను పొందింది. సినిమా మే 15న విడుదల కానుంది. శ్రీహరిగారు ఇందులో కీలకపాత్రలో నటించారు. ఆయన రోల్ కి సంబంధించిన కథ విన్న ఆయన నేషనల్ అవార్డ్ గ్యారంటీ అన్నారు. కానీ దురదృషవశాతు ఇప్పుడు ఆయన మన మధ్య లేరు. మణిశర్మగారు అద్భుతమైన సంగీతం ఇచ్చారు. మ్యూజిక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాని ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది’’ అన్నారు.

నిర్మాత శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ ‘’ఈ సినిమా కోసం మూడేళ్లు యూనిట్ అంతా బాగా కష్టపడ్డారు. సినిమా సూపర్ గా వచ్చింది. సినిమాని చూసిన పసుపులేటి కన్నమాంబగారు సినిమాని నైజాం, సీడెడ్, ఆంధ్రాల్లో రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. అందుకు ఆయనకి థాంక్స్. సినిమా 15న విడుదలవుతుంది. తప్పకుండా ప్రేక్షకులు మెచ్చే చిత్రమవుతుంది’’ అన్నారు.

పసుపులేటి కన్నమాంబ మాట్లాడుతూ ‘’అమ్మరాజశేఖర్ తో చాలా కాలంగా పరిచయం ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం సరైన కారణంతో కలుసుకున్నాను. సినిమా చూడగానే నాకు నచ్చింది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. రణం కంటే మంచి సక్సెస్ ను సాధిస్తుంది’’ అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved