pizza
Tholi Kiranam Press Meet
‘తొలి కిరణం’ ప్రెస్ మీట్
ou are at idlebrain.com > News > Functions
Follow Us

30 April 2016
Hyderabad

సువర్ణ క్రియేషన్స్ బ్యానర్ పై పి.డి.రాజు ప్రధాన పాత్రలో జె.జాన్ బాబు దర్శకత్వంలో టి.సుధాకర్ నిర్మిస్తున్న చిత్రం తొలి కిరణం. మూడు పాటలు మినహా సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ శనివారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో....

దర్శకుడు జె.జాన్ బాబు మాట్లాడుతూ ‘’మూడు పాటలు మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. అలాగే కీలక సన్నివేశాల కోసం జెరుషలేం, ఈజిప్టు దేశాలకు వెళ్లి అక్కడ చిత్రీకరణ చేయనున్నాం. జీసస్ జీవితంలో జరిగిన కొన్ని విషయాలను ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయలేదు. వాటిని ఈ చిత్రంలో చూపించబోతున్నాం. ఆర్.పి.పట్నాయక్ గారు మంచి సంగీతం అందించారు. జూన్ లేదా జూలై మొదటివారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ ‘’జీసస్ పై చిత్రీకరిస్తున్న సినిమా. ఆయన జీవితంలో జరిగిన అద్భుత ఘట్టాలను ఈ సినిమాలో చూపిస్తున్నాం. చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని సినిమాకు సంగీతం అందించాను’’ అన్నారు.

నిర్మాత సుధాకర్ మాట్లాడుతూ ‘’కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కోసం జెరుసలేం, ఈజిప్టులకు వెళుతున్నాం. సినిమా బాగా వచ్చింది. జూన్ లేదా జూలై మొదటి వారంలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో పి.డి.రాజు, అభినయం, జెమిని సురేష్, మౌనిక తదితరులు పాల్గొన్నారు. 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved