pizza
Kshanam success meet
‘క్షణం’ సక్సెస్ మీట్
You are at idlebrain.com > News > Functions
Follow Us

01 March 2016
Hyderabad

టాలీవుడ్ నిర్మాణ రంగంలో ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి బ్యానర్, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ తో కలిసి నిర్మించిన చిత్రం ‘క్షణం’. అడవిశేష్, ఆదాశర్మ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ సరికొత్త పాత్రలో నటించింది. జ్యోతిలక్ష్మి ఫేమ్ సత్యదేవ్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, రవి వర్మ ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రధారులు. సినిమా ఫిభ్రవరి 26న విడుదలైంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన సక్సెస్ మీట్ లో....

దగ్గుబాటి రానా మాట్లాడుతూ ‘’నేను, బన్ని సినిమా చూడటానికి వెళ్ళాం. సినిమా చూస్తున్నప్పుడు ఒక్క ట్విస్ట్ కూడా ఐడెంటిఫై చేయలేకపోయాను. ప్రతి సీన్ కు ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇలాంటి డిఫరెంట్ థ్రిల్లర్ మూవీస్ మరిన్ని రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

లక్ష్మీ మంచు మాట్లాడుతూ ‘’సినిమాను వైజాగ్ లో చూశాను. మ్యూజిక్, లవ్ స్టోరీ ఇలా ప్రతి ఎలిమెంట్ ఆడియెన్ కు బాగా కనెక్ట్ అవుతుంది. చాలా ఎగ్జయిట్ మెంట్ తో చూసిన సినిమా ఇది’’ అన్నారు.

ప్రకాష్ కోవెలమూడి మాట్లాడుతూ ‘‘రవికాంత్ డైరెక్షన్ బావుంది. తను ఫస్ట్ సినిమా చేసినట్టు లేదు. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా ప్రతిదీ సినిమాకు ప్లస్ అయ్యాయి. తక్కువ బడ్జెట్ లో బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు’’ అన్నారు.

పివిపి మాట్లాడుతూ ‘’సినిమా లవర్స్ తో పాటు ప్రేక్షకులందరికీ నచ్చిన సినిమా. త్వరలోనే మా బ్యానర్ లో రానా హీరోగా ఘాజీ సినిమాను విడుదల చేస్తున్నాం. క్షణ సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు.

రవికాంత్ పేరెపు మాట్లాడుతూ ‘’పివిపిగారు లేకపోతే సినిమాకు ఇంత మంచి గుర్తింపు వచ్చేది కాదు. ప్రేక్షకులు, ఇండస్ట్రీ పర్సన్స్ అందరూ సినిమాను మెచ్చుకుంటున్నారు. సక్సెస్ చేసిన అందరికీ థాంక్స్’’ అన్నారు.

అడవిశేష్ మాట్లాడుతూ ‘’సినిమా స్టార్టింగ్ నుండి పివిపిగారు మాకు సపోర్ట్ గా నిలబడ్డారు. బన్ని, రానా, రకుల్ ఇలా సినిమా చూసిన అందరూ పర్సనల్ గా మెచ్చుకుంటున్నారు. పివిపిగారి సపోర్ట్ తోనే సినిమా పెద్ద హిట్టయ్యింది’’ అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved