2 December 2018
Hyderabad
శ్రీకాంత్ కథానాయకుడిగా అలివేలమ్మ ప్రొడక్షన్స్ పతాకంపై అలివేలు నిర్మిస్తున్న సినిమా 'ఆపరేషన్ 2019'. బివేర్ ఆఫ్ పబ్లిక్... అనేది ఉపశీర్షిక. కరణం బాబ్జి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మంచు మనోజ్కుమార్, సునీల్ 'కీ రోల్స్' (కీలక పాత్రలు) చేస్తున్నారు. డిసెంబర్ 1న సినిమాను విడుదలైంది. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ - ''ఓ మంచి ఉద్దేశంతో తీసిన మా 'ఆపరేషన్ 2019' చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్. ఈ మధ్య విడుదలైన నా చిత్రాల్లో మంచి ఆదరణనను పొందుతున్న చిత్రమిది. అన్నీ ఏరియాస్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ప్రొడ్యూసర్, బయ్యర్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు. అయితే సినీ విశ్లేషకులు మా సినిమాకు మరింత మంచి రేటింగ్స్ ఇచ్చి ఉంటే బావుండేదని బాధ కలిగింది. సినిమా చూసిన అందరూ కరెక్ట్ టైమ్లో కరెక్ట్ మూవీ చేశారని అప్రిషియేట్ చేస్తున్నారు. ప్రజల్లో అవేర్నెస్ను కలిగిస్తున్న చిత్రమిది. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా నేను చేసిన మరో మంచి ప్రయత్నంగా భావిస్తున్నాను. ఇప్పటి రాజకీయాలకు అద్దం పడుతున్న సినిమా'' అన్నారు.
నటుడు శివకృష్ణ మాట్లాడుతూ - ''మంచి ఆలోచనతో, ప్రేక్షకుల్లో అవేర్నెస్ను తీసుకు రావాలనే ప్రయత్నంతో చేసిన చిత్రమిది. ఇలాంటి మంచి సినిమా చేసిన దర్శక నిర్మాతలను, హీరో శ్రీకాంత్ను అభినందిస్తున్నాను. ఎన్నికల్లో మంచి నాయకులను ఎన్నుకోకుంటే రాష్ట్రానికే కాదు.. దేశానికే ప్రమాదం అని చెప్పే చిత్రమిది'' అన్నారు.
దర్శకుడు కరణం బాబ్జి మాట్లాడుతూ - ''నేను దర్శకుడిగా కంటే బాధ్యత గల పౌరుడిగా భావించి చేసిన చిత్రమిది. రాజకీయ ప్రక్షాళన జరిగితే బావుంటుందనే మెసేజ్ను మా చిత్రం ద్వారా చెప్పాం. ఈ సినిమా ద్వారా ఎవరినీ కించ పరిచే ఉద్దేశం మాకు లేదు. అన్నీ ఏరియాల నుండి మంచి స్పందన వస్తుంది. ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్'' అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ -''శ్రీకాంత్గారు ఎంతగానో సపోర్ట్ను అందించారు. ప్రజలకు సేవ చేయాలనుకునే ఓ ఎన్నారైకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. దాని వల్ల అతను ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు. చివరకు ప్రజలకు ఏం చెప్పాడనే విషయాన్ని దర్శకుడు బాబ్జిగారు చక్కగా తెరకెక్కించారు. ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్'' అన్నారు.
ఈ కార్యరక్రమంలో తోటపల్లి మధు, నటుడు మధు, మ్యూజిక్ డైరెక్టర్ ర్యాప్ రాక్ షకీల్ తదితరులు పాల్గొన్నానరు.