శర్వానంద్, సాయిపల్లవి జంటగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై హను రాఘవపూడి దర్శకత్వంలో చెరుకూరి సుధాకర్ నిర్మించిన చిత్రం 'పడి పడి లేచె మనసు'. డిసెంబర్ 21న సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో సక్సెస్ మీట్ జరిగింది. ఈ సంద్భంగా...
శత్రు మాట్లాడుతూ - '' సినిమా చూస్తున్నప్పుడు కొన్ని ఎమోషనల్ సీన్స్లో అయితే నాకు ఏడుపు కూడా వచ్చేసింది. సాధారణంగా నేను ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నంగా నన్ను ఓ కామెడీ యాంగిల్లో ఉన్న పాత్రలో చూపించారు. ఇలాంటి చిత్రంలో నటించడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. సూర్యగా శర్వానంద్, వైశాలిగా సాయిపల్లవి పాత్రల్లో ఇమిడిపోయారు. అలాంటి అవకాశాన్ని నాకు కల్పించిన దర్శకుడు హను, నిర్మాత సుధాకర్గారికి థాంక్స్'' అన్నారు.
కల్పిక మాట్లాడుతూ - ''బ్యూటీఫుల్ ఫీల్, మ్యూజిక్, విజువల్స్, ఎమోషన్స్ ఉన్న సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి. అలాంటి తక్కువ జాబితాలోని మూవీస్లో 'పడి పడి లేచె మనసు' ఒకటి. హనుగారు నాపై నమ్మకంతో నాకు షాలిని అనే డాక్టర్ రోల్ను ఇచ్చారు. అలాగే సుధాకర్గారికి థాంక్స్'' అన్నారు.
నిర్మాత చెరుకూరి సుధాకర్ మాట్లాడుతూ - ''సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్. చిత్రంలో నటించిన ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులకు థాంక్స్'' అన్నారు.
హీరో శర్వానంద్ మాట్లాడుతూ - ''సినిమాపై చాలా ఎక్స్పెక్ట్ చేశాను. చాలా పెద్ద రేంజ్ సినిమా అవుతుందని అనుకున్నాను. అయితే నాకు ఇది గుర్తుండిపోయే సినిమాగా నిలిచిపోయింది. ఇలాంటి సినిమా చేసినందుకు గర్వంగా ఉంది. నా కెరీర్లోని బెస్ట్ ఆల్బమ్ మూవీస్లో ఇదొకటిగా ఉండిపోతుంది. విమర్శకులు మంచి అనుకున్నవి చెప్పారు.. చెడుగా అనిపించింది రాశారు. కొంత మంది ప్రేక్షకులు కూడా ఫోన్ చేసి మాట్లాడారు. అందరికీ థాంక్స్. అందరి సలహాలు తీసుకుని నెక్స్ట్ టైమ్ ఇంకా మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను'' అన్నారు.