ప్రేమ కథా చిత్రం , భలే మంచి రోజు, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని లాంటి విభిన్న ప్రేమ కథా చిత్రాల్లో నటించి మెప్పించడమే కాకుండా బాలీవుడ్ లో భాగీ లాంటి భారీ చిత్రంలో నటించిన హీరో సుధీర్ బాబు నిర్మాతగా మారి సుధీర్బాబు ప్రొడక్షన్స్ పేరుతో బ్యానర్ ని స్టార్ట్ చేసారు. మే 26న సినీ ప్రముఖుల సమక్షంలో ఈ ప్రొడక్షన్ లోగోని వైభవంగా ప్రారంభిస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రిలో తనకంటూ మంచి ఇమేజ్ ని సొంతం చేసుకుని హ్యాండ్ సమ్ రొమాంటిక్ హీరో ఇమేజ్ తో కెరీర్ ని ముందుకు కొనసాగిస్తున్న సుధీర్బాబు నిర్మాత గా మారి వరుస చిత్రాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా శనివారం సుధీర్బాబు ప్రొడక్షన్స్ బ్యానర్ లోగోను విడుదల చేశారు. లోగోను అల్లు అరవింద్ లాంచ్ చేశారు. వీడియో లోగోను దిల్రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా...
సుధీర్ బాబు మాట్లాడుతూ ``నా బ్యానర్కు తిరకాసు లేకుండా సుధీర్బాబు ప్రొడక్షన్స్ అనే పేరు పెట్టాను. నా సినిమా జర్నీలో డిఫరెంట్ టాలెంట్ ఉన్న వ్యక్తుల్ని కలిశాను. వాళ్లలో డైరెక్టర్స్, సినిమాటోగ్రాఫర్స్, కొరియోగ్రాఫర్స్, ఫైట్ మాస్టర్స్ అందరూ ఉన్నారు. అలా పరిచయమైన వారిలో చాలా మంది మంచి అవకాశాలు రాక.. వారి ఆశయాలను తొక్కి పక్కన పడేసి వేరే ఫీల్డ్లోకి వెళ్లిపోవడం కానీ... వెనక్కి పోవడం కానీ చేశారు. ఆ టైమ్లో నేను అనుకున్నాను. `నేను ఓ ప్రొడక్షన్ స్టార్ట్ చేసే కెపాసిటీలో ఉన్నప్పుడు ఎవైనా కొన్ని సినిమాలు తీయాలి`. అప్పటి నుండి నిర్మాణ రంగంపై ఆసక్తి మొదలైంది. హిట్ ప్లాప్ అయినా ఎవరైనా క్రియేట్ చేస్తున్నారు. ఓ బాధ్యతగా ఫీలై ఈ బ్యానర్ను స్టార్ట్ చేశాను. భవిష్యత్లో నేను డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతే.. నా కన్నా మరేవరైనా ఓ కథకు న్యాయం చేస్తారనిపిస్తే వేరే హీరోలతో సినిమాలు చేస్తాను. మా ఫ్యామిలీలో పద్మాలయా, కృష్ణ ప్రొడక్షన్స్, ఇందిరా ప్రొడక్షన్స్, మహేశ్ బాబు ప్రొడక్షన్స్ సంస్థలున్నాయి. నేను బ్యానర్ పెట్టడానికి కారణం వ్యక్తిగతంగా ఎదగాలనుకోవడమే. మా ఫ్యామిలీలో కృష్ణగారు, మహేశ్గారున్నా వాళ్లని వాడేసుకోవాలనుకోలేదు. అలా చేస్తే నాకు సంతృప్తి ఎక్కువగా ఉంటుంది. అల్లు అరవింద్గారు, దిల్రాజుగారు వంటి నిర్మాతలు జనాలకు గుర్తుండిపోయే సినిమాలు చేశారు. వారిలా నేను కూడా మంచి సినిమాలు చేయాలనేదే నా విజన్. ప్రతి మంచి సినిమా నాకు బ్యానర్పెట్టడానికి కారణమైయ్యాయి. మొదటి ప్రొడక్షన్లో సినిమా రాబోతుంది. మంచి ఎంటర్టైనింగ్ సబ్జెక్ట్ చేశాననే శాటిస్ఫాక్షన్ ఉంది. మంచి కథ, కథనాలతోనే నిర్మాణంలోకి అడుగుపెట్టాను. అదీ కాకుండా.. నేను చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం కొత్త బ్యానర్స్లో చేసినవే. అలా చేసే క్రమంలో వారి నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. నేను ప్రొడ్యూసర్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. రేపు భవిష్యత్లో డైరెక్టర్ అవుతానేమో తెలియదు కానీ.. ప్రస్తుతానికి అటువంటి ఆలోచనలు లేవు. బయట ప్రొడ్యూసర్స్తోనే ముందు సినిమాలు చేసుకుంటాను. తర్వాతే నా బ్యానర్లోనే సినిమాలు చేసుకుంటాను. నిర్మాతగా ఎంత బాధ్యత ఉంటుందో తెలుసు. అది ఈరోజు నుండే తెలుసుకుంటున్నాను. సినిమా 80 శాతం పూర్తయ్యింది. సమ్మోహనం నెక్ట్స్ నెల విడుదలవుతుంది. దాని తర్వాత నా ఫస్ట్ ప్రొడక్షన్లో రాబోయే సినిమా గురించిన వివరాలు తెలియజేస్తాను. ఈ సినిమాతో కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. మంచి టాలంటెడ్ వ్యక్తి. ఆ డైరెక్టర్ పేరు ఆర్.ఎస్.నాయుడు. త్వరలోనే డైరెక్టర్ అండ్ టీంను లాంచ్ చేస్తాను`` అన్నారు.
అనీల్ సుంకర మాట్లాడుతూ - ``సుధీర్బాబుగారితో వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉంది. ఆయన ఆలోచనలకు తగినట్టు ఆయన స్టార్ట్ చేసిన ఈ బ్యానర్ పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను`` అన్నారు.
శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ - ``సుధీర్ బాబు మంచి కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. ఆయన ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం ఆనందంగా ఉంది. ఆయన ప్రొడక్షన్ కూడా కమిట్మెంట్తో ఉంటుందని భావిస్తున్నాను. నిర్మాతల్లో నాకు పెద్దగా చేంజస్ కనపడలేదు`` అన్నారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ - ``సుధీర్బాబు ఏ బ్యాగ్రౌండ్ నుండి వచ్చాడు అని కాకుండా వ్యక్తిగతంగా తనేం చేయగలడు అని తెలుసుకుని దానిపై సినిమాలు చేసుకుంటూ నటుడిగా ఎదిగాడు. మంచి మనసున్న మంచి వ్యక్తి. ఎవరి ఇన్ఫ్లూయెన్స్ లేకుండా పైకి రావాలని తాపత్రయపడే వ్యక్తి. భాగి సినిమాలో తనను చూస్తే తనలో ఎంత కసి ఉందో అర్థమవుతుంది. ఓ బ్యానర్ను స్టార్ట్ చేయడం చాలా పెద్ద విషయం. ఈ నిర్మాణ సంస్థ ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
దిల్రాజు మాట్లాడుతూ - ``కృష్ణగారికి అల్లుడు కాకముందు నుండి సుధీర్ బాబుకి సినిమాలంటే ఎంత ఆసక్తో నాకు తెలుసు. తను స్టార్ట్చేసిన బ్యానర్లో విజయవంతమైన సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను`` అన్నారు.ఈ కార్యక్రమంలో వంశీ పైడిపల్లి, ప్రవీణ్ సత్తారు, సందీప్కిషన్, కృష్ణచైతన్, శ్రీరామ్ ఆదిత్య, వెంకీ అట్లూరి తదితరులు పాల్గొన్నారు.