మనీష్ గౌర్ హాలీవుడ్ ఫిలింస్ పతాకంపై మనీష్ గౌర్ సమర్పణలో అమ్మయి రసజ్ఞ టైటిల్ పాత్రలో శ్రీరాజ్ గౌడ్, పూజ జంటగా రూపొందుతున్న చిత్రం `అమ్మో అమ్మోరు`. ఈ చిత్రం టీజర్ లాంచ్ ఆవిష్కరణ ఈ రోజు ఫిలించాంబర్ లో లాంచ్ అయింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామసత్యనారాయణ మాట్లాడుతూ...``సంగీత దర్శకుడు అర్జున్ గారు నా తొంభై సినిమాలకు సంగీతాన్ని అందించారు. ` అమ్మో అమ్మోరు` చిత్రానికి కూడా తనే మ్యూజిక్ చేశారు. టీజర్ చాలా బాగుంది. దర్శకుడు రాముకి , నిర్మాతలకు, పని చేసిన ప్రతి ఒక్కరికీ ఈ సినిమా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నా`` అని అన్నారు.
మరో అతిథి సాయి వెంకట్ మాట్లాడుతూ....``టీజర్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది. అమ్మోరు పాత్రలో రసజ్ఞ ఇమిడిపోయింది. దర్శక నిర్మాతలు ఈ సినిమా మంచి పేరు తీసుకరావాల్నారు.
సంగీత దర్శకుడు అర్జున్ మాట్లాడుతూ....``ఈ చిత్ర దర్శకుడు రాము నాకు చాలా కాలంగా మంచి మిత్రుడు. సినిమా చాలా బాగా తెరకెక్కిస్తున్నాడు. ఇందులో నాలుగు పాటలు ఉన్నాయి. దేవుడికి , దుష్ట శక్తికి జరిగే పోరాటమే ఈ చిత్రం. పాటలతో పాటు నేపథ్య సంగీతానికి కూడా ప్రాధాన్యత ఉందని`` చెప్పారు.
అమ్మోరు పాత్ర ధారి బేబి రసజ్ఞ మాట్లాడుతూ...``అమ్మోరు పాత్ర చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు, సపోర్ట్ చేస్తోన్న మా కుటంబ సభ్యులకు ధ్యాంక్స్ `` అన్నారు.
నిర్మాత బియన్ రెడ్డి మాట్లాడుతూ...``రాము మంచి కథతో ఈ సినిమా చేశాడు. టీజర్ అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది. సినిమా మొత్తం పూర్తయింది. మా తొలి ప్రయత్నాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా`` అన్నారు.
హీరో శ్రీరాజ్ గౌడ్ మాట్లాడుతూ...``ఇది నా ఫస్ట్ ఫిలిం. రాముగారు చాలా బాగా డీల్ చేసారు. సినిమా అందరికీ నచ్చుతుందన్నారు`
ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్ పూజ, దర్శకులు హరిబాబు, అళహరి తదితరులు పాల్గొన్నారు.