29 October 2017
Hyderabad
గోపీచంద్ కథానాయకుడిగా ఏ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్ ఎంటర్ టైనర్ 'ఆక్సిజన్'. గోపీచంద్ సరసన రాశీఖన్నా, అను ఇమ్యాన్యుయేల్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మించారు. సినిమా నవంబర్ 10న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్తో ఇంటర్వ్యూ...
'ఆక్సిజన్' నా తొలి తెలుగు చిత్రం. ఇందులో నా పాత్ర పేరు గీత. డాక్టర్ పాత్రలో కనపడతాను. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడే నాకు 'మజ్ను' సినిమాలో అవకాశం వచ్చింది. నేను మలయాళ సినిమా 'యాక్షన్ హీరో బిజు'లో నటించాను. ఆ సినిమా చూసిన డైరెక్టర్గారు నా ఫోటోలను చూసి యు.ఎస్లో ఉన్న, నన్ను కాంటాక్ట్ చేశారు. గోపీచంద్గారితో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. తెలుగులో ఎక్కువగా సినిమాలు వస్తున్నాయి. మంచి మంచి పాత్రలు వస్తున్నాయి. ఇక్కడ వాతావరణం కూడా బావుంది. కాబట్టి, నేను ప్రస్తుతం తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నాను. తమిళంలో ఓ సినిమా చేశాను. మలయాళ సినిమాల్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన నేను అక్కడ కూడా సినిమాలు చేయాలనుకుంటున్నాను. తెలుగులో పెద్ద పెద్ద స్టార్స్తో నటిస్తున్నాను. ముఖ్యంగా పవన్కల్యాణ్గారితో నటించడం చాలా ఆనందంగా ఉంది. గ్రేట్ ఎక్స్పీరియెన్స్. అలాగే ఇప్పుడు బన్నితో సినిమా చేస్తున్నాను. మారుతిగారి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందుతోన్న చిత్రంలో నటిస్తున్నాను. నాకు తెలుగులో నటించేటప్పుడు భాష రాదు. కాస్త భయపడ్డాను. అయితే డైరెక్టర్ జోతికృష్ణగారు నన్ను బిడ్డలాగా చూసుకున్నారు. పూర్తిగా సహకారం అందించారు. 'ఆక్సిజన్' సినిమాలో యాక్షన్ పార్టన ఎక్కువగా ఉంటుంది. ఓ నటిగా అన్నీ రోల్స్ చేయాలనుకుంటున్నాను. అందులో భాగంగా గ్లామరస్ రోల్స్ చేయడానికి నేను సిద్ధమే. కానీ వల్గర్గా ఉండకూడదని అనుకుంటాను. నేను హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. ఇక్కడ ఫ్లాట్ కూడా కొనుక్కున్నాను. నేను అందరితో స్నేహంగానే ఉంటాను. కానీ నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఎవరూ లేరిక్కడ. తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవాలనుకుంటున్నాను. పవన్ కల్యాణ్గారి సినిమాకైనా కుదురుతుందేమో చూడాలి'' అన్నారు.