ఎనర్జికి బ్రాండ్ ఎంబాసడర్ గా తన నటనతో మెస్మరైజ్ చేసి అభిమానులకి, ప్రేక్షుకలకి కిక్కిచ్చే మాస్ మహరాజ రవితేజ నటించిన బెంగాల్టైగర్ చిత్రం విడుదలకి సిద్దంగా వుంది.
ఈ సందర్బంగా నిర్మాత కె కె రాధామోహన్ మాట్లాడుతూ" మా బెంగాల్ టైగర్ చిత్ర షూటింగ్ కార్కక్రమాలు పూర్తిచేసుకుంది. ఎటువంటి రీషూట్ లు చేయటం లేదు. ఇటీవల ప్యాచ్వర్క్ తో గమ్మడికాయ కొట్టేసాము. పోస్ట్ప్రోడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకున్నాము. మా చిత్రాన్ని ముందుగా నవంబర్ 5న విడుదల చేయటానికి నిర్ణయించాము. అయితే అఖిల్ చిత్రం పోస్ట్పోన్ కావటం తో నవంబర్ 5న రావటం కుదరలేదు. గ్లొబల్ ఫిల్మ్డిస్ట్రిబ్యూషన్ వారు మా చిత్రం మరియు అఖిల్ చిత్రం యొక్క తెలంగాణా రాష్ట్ర పంపిణి రైట్స్ కొనియున్నారు కావున రెండు పెద్దచిత్రాలు విడుదలకి గ్యాప్ కావసివుంది. ఇరువురు సంప్రదింపులు జరిపాక విడుదల తేది ని ఎనౌన్స్ చేస్తాము. మా చిత్రం ఏ డేట్కైనా విడుదలకి సిద్దంగా వుంది. ఎటువంటి రీషూట్ కార్యక్రమాలు జరుపుకోవటం లేదు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మా చిత్ర యూనిట్ అందరి సహయంతో పూర్తిచేశాము. రవితేజ ఎనర్జిటిక్ పెర్ ఫార్మెన్స్ మెస్మరైజ్ చేస్తుంది. ఇటీవల మా బెంగాల్ టైగర్ ఆడియోకి సూపర్ రెస్పాన్స్ రావటమే కాకుండా సినిమాపై అంచనాలు పెంచాయి. దర్శకుడు సంపత్ నంది ప్రేక్షకుల నాడి బాగా తెలుసు. ఈ విషయం రేపు చూసిన ప్రేక్షకులు చెప్తారు. ఈచిత్రం రవితేజ గారి కెరీర్ లో బెస్ట్ కమర్షియల్ ఫిల్మ్ గా నిలుస్తుందని మా నమ్మకం" అని అన్నారు