09 September 2015
Hyderabad
‘బొంబాయి మిఠాయి’ తినిపించనున్న ‘భీమవరం టాకీస్’
వరుస సినిమాలతో మాత్రమే కాదు.. వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ ‘భీమవరం టాకీస్’ తాజాగా.. కన్నడలో ఘన విజయం సాధించిన ‘బొంబాయి మిఠాయి’ చిత్రం తెలుగు హక్కులు సొంతం చేసుకొంది. విక్రమ్, దిశాపాండే, నిరంజన్ దేశ్పాండే, చిక్కన్న ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి చంద్రమోహన్ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ‘‘తెలుగులో తక్కువ బడ్జెట్లో రూపొందిన ‘సినిమా చూపిస్త మావ, భలే భలే మగాడివోయ్’ చిత్రాలు ఎంతటి ఘన విజయం సాధిస్తున్నాయో.. కన్నడలో ‘బొంబాయి మిఠాయి’ అంతటి ఘన విజయం సొంతం చేసుకొంది. కన్నడ లో ఈ చిత్రం పది కోట్లకు పైగా వసూలు చెసింది. త్వరలో అనువాద కార్యక్రమాలు ప్రారంభించనున్నామ్ ’ అన్నారు.
విక్రమ్, దిశాపాండే, నిరంజన్ దేశ్పాండే, చిక్కన్న, బుల్లెట్ ప్రకాష్, ఆర్.జె.రోహిత్ తదితరులు ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి సంగీతం: వీర్ సమరత్, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ`స్క్రీన్ప్లే`దర్శకత్వం: చంద్రమోహన్!!