23 April 2015
Hyderabad
అల్లాణి శ్రీదర్ దర్శకుడిగా ..ఈటివి..ఫిల్మీడియా ప్రొడక్షన్స్ ప్రవేట్ లిమిటెడ్ సంయుక్తంగా రూపొందించిన చిలుకూరు బాలాజీ సినిమా సిజీ వర్క్ పూర్తయింది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు నిర్మాత అల్లాణి శ్రీధర్ తెలిపారు..ఈసినిమా ప్రోగ్రెస్ గురించి వివరిస్తూ ...
త్వరలో సినిమా ఆడియోను కూడా విడుదల చేయనున్నాము. ఈటివి వారు విదేశాల్లో నిర్వహించిన పాడుతా తీయగా కార్యక్రమం ప్రారంభంలో ఈ సినిమా కూ సంబంధించిన ట్రైలర్ లను ప్రదర్శించడం వల్ల ఈ సినిమాకు విదేశాల్లో సైతం మంచి క్రేజ్ ఏర్పడింది. అక్కడి వారు కూడా సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదరు చూస్తున్నారు..ఇప్పటి వరకు మనకు వచ్చిన భక్తి సినిమాలను ఒక సారి పరిశీలించినట్లయితే వెంకటేశ్వర స్వామి మీద వచ్చిన సినిమాలు దాదాపు అన్నీ బాగా ఆడాయి.. ఆ కోవ లోనే ఈ సినిమా కూడా ఉంటుంది.ఈ సినిమాలో సాయి కుమార్ , యస్పీ బాలసుబ్రహ్మణ్య పాత్రలు సినిమాకు మూల స్థంభాల వంటివి..ఈ సినిమాలో చిలుకూరు వేంకటేశ్వరస్వామి మహిమలు భక్తులను అలరిస్తాయి అన్నారు.
సినిమాలో సాయి కుమార్, సుమన్, సునీల్ శర్మ, భానుశ్రీ మెహ్రా ప్రధాన పాత్రలుపో షించారు.