18 September 2017
Hyderabad
Mr. Perfecct కథ వివాదానికి సంబంధించి.. వివరణ ఇస్తే మంచిదని మిత్రులు, శ్రేయోభిలాషులు నాకు.. రాజుగారికి సూచించడం జరిగింది . అందుకే ఈ ప్రెస్ స్టేట్ మెంట్ఇ స్తున్నాం .
శ్రీమతి శ్యామలారాణి గారు (వయసు 63 సంవత్సరాలు), తాను రాసిన "నా మనసు కోరింది నిన్నే" అనే నవలని 2010 ఆగష్టు లో రిలీజ్ చేసారని.. ఆ నవలలో ఉన్న కథని తీసుకొని Mr. ప్రెఫెక్ట్ సినిమా తీసారని కేసు వేశారు .
అయితే ఆ నవల రిలీజ్ అవటానికి 18 నెలల ,ముందే 2009, ఫిబ్రవరి 19 న మిస్టర్ పర్ఫెక్ట్ కథని "నవ్వుతూ అనే పేరుతో రైటర్స్ యూనియన్ లో రిజిస్టర్ చేయడం జరిగింది.
ఆ నవల రిలీజ్ అవటానికి రెండు సంవత్సరాల ముందే 2008 డిసెంబర్ లో నేను, రాజుగారు మలేషియా వెళ్లి బిళ్ళ షూటింగ్ లో ఉన్న ప్రభాస్ గారికి, మిస్టర్ పర్ఫెక్ట్ కథ చెప్పడం జరిగింది.
ఈ విషయాన్ని రైటర్స్ యూనియన్ ప్రెసిడెంట్ శ్రీ గోపాలకృష్ణ గారు, శ్యామలరాణి గారికి ఆరు నెలల క్రితమే వివరించారు. అయినా ఆమె ఈ విషయాన్నీ అర్ధం చేసుకోకపోవడం దురదృష్టకరం. ఆమె నిజాలని ఇప్పటికయినా గ్రహించాలని కోరుతూ...
మీ దశరధ్