లక్కీ మీడియా బ్యానర్ను స్టార్ట్ చేసి పదేళ్లుగా మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత బెక్కం వేణుగోపాల్(గోపి) రీసెంట్గా `సినిమా చూపిస్త మావ`తో సూపర్హిట్ సాధించిన సంగతి తెలిసిందే. లక్కీ మీడియా బ్యానర్పై భాస్కర్ బండి దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `నాన్న నేను నా బాయ్ఫ్రెండ్స్`. రావు రమేష్, హెబ్బా పటేల్, తేజస్వి మడివాడ, అశ్విన్, పార్వతీశం, నోయెల్ సేన్ ప్రధాన తారాగణంగా నటించారు. సినిమా డిసెంబర్ 16న విడుదలవుతుంది. ఈ సందర్భంగా...
హెబ్బా పటేల్ మాట్లాడుతూ - ``రియల్ లైఫ్లో నాకు బాయ్ఫ్రెండ్స్తో తిరిగేంత టైం లేదు. ఇక నాన్న నేను నా బాయ్ఫ్రెండ్స్ సినిమా విషయానికి వచ్చేసరికి ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు పద్మావతి. ఈ సినిమాలో నాకు నాన్న పాత్రలో చేసిన రావురమేష్ నన్ను అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. సిటీలోకి వచ్చిన పద్మావతి ఓ ఫ్రెండ్ దొరుకుతుంది. ఓసందర్భంలో పద్మావతి చేసే చిన్న తప్పు వల్ల ఆమె, ఆమె చుట్టు ఉన్నవారు ఎలాంటి సమస్యలను ఫేస్ చేస్తారనేదే సినిమా. ఈ సినిమాలో నేనొక స్టుపిడ్ అమ్మాయిలా కనిపిస్తాను అంటే తనెం చేస్తుందో, దాని వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలియకుండా పనులు చేసేస్తుంటుంది. అలాంటి అమ్మాయి కోసం వాళ్ల నాన్న ఏం చేశాడనేదే కథ. మంచి కథ, తండ్రికూతుళ్ల మధ్య రిలేషన్ నచ్చి సినిమాను చేయడానికి ఒప్పుకున్నాను. భాస్కర్ బండిగారు దర్శకుడు కాకముందు చోటాగారు, వినాయక్గారి వద్ద పనిచేశారు. సినిమా గురించి మంచి అవగాహన ఉన్న వ్యక్తి కావడంతో సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. అలాగే చోటాగారితో పనిచేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది. ప్రతి సీన్ను ఎంతో ఫ్రెష్ లుక్తో చూపించారు. బెక్కం వేణుగోపాల్గారు నన్ను కలిసి స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఆయనే దర్శకుడేమో అనుకున్నాను. ప్రతి విషయంలో ఎంతో కేర్ తీసుకున్నారు. దిల్రాజుగారు మా సినిమాను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. సినిమా చివరి ఇరవై నిమిషాలు సినిమాలో చాలా కీలకం. నేను సినిమా విషయాలను మా అమ్మ, సిస్టర్స్తో డిస్కస్ చేస్తాను. నిజ జీవితంలో నాన్న అంటే ఇష్టమైనా, కొంత భయం కూడా ఉంది. ప్రస్తుతం అంధగాడు, మిష్టర్, ఏంజెల్ సినిమాలను చేస్తున్నాను`` అన్నారు.