17 February 2016
Hyderabad
రన్ రాజా రన్, జిల్, ఉత్తమవిలన్, చీకటి రాజ్యం వంటి చిత్రాలకు సంగీతం అందించి సంగీత ప్రియులను అలరించిన మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్. ఇప్పుడు వెంకటేష్, మారుతి కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో
జిబ్రాన్ మాట్లాడుతూ ....’’నేను సింగపూర్ లో చదువుకున్నాను. విజయవాడ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాను. తెలుగు బాగా అర్థం అవుతుంది. మాట్లాడగలుగుతాను కూడా అయితే తప్పలుంటాయని భావన ఉంది. ఇక్కడే అంటే హైదరాబాద్ లో సెటిల్ కావాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం నేను వెంకటేష్, మారుతి గారి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రానికి సంగీతం అందిస్తున్నాను. ఈ చిత్రంలో పాటలను చాలా మెలోడియస్ గా అలాగే కమర్షియల్ వాల్యూస్ తో ఉంటాయి. సినిమాలో ఐదు సాంగ్స్, ఒక బిట్ సాంగ్ ఉన్నాయి. నేను వెంకటేష్ గారి సినిమాలను చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగాను. ఆయనతో కలిసి పనిచేయాలని అనగానే టెన్షన్ గా అనిపించింది. అయితే సినిమాకు ముందుగా ఓ ఫంక్షన్ లో వెంకటేష్ గారిని కలిశాను. ఆయనతో చాలా హ్యపీగా రిసీవ్ చేసుకుని హాగ్ చేసుకున్నారు. అలా ఆయన పరిచయంతో నాలో టెన్షన్ కొద్ది కొద్దిగా తగ్గింది. అలాగే ప్రభాస్, సుజిత్ దర్శకత్వంలో సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాను. బాహుబలి సినిమాతో ప్రభాస్ గారి ఇమేజ్ వరల్డ్ వైడ్ పెరిగింది. మొన్న రాజస్థాన్ లోని ఓ చిన్న ఊరుకి వెళ్ళాను. అక్కడ కూడా బాహుబలి చేసిన రాజమౌళి నేను అనుకుని బాగా రిసీవ్ చేసుకున్నారు. బాహుబలి బావుందని అక్కడి వరు మెచ్చుకున్నారు. ఆ సినిమా ఇంపాక్ట్ అలా ఉంది. దాంతో ఈ సినిమాకు కూడా హై స్టాండర్డ్స్ లో మ్యూజిక్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. విశ్వరూపం సినిమా మొత్తం పూర్తయ్యింది. అయితే విడుదలకు సంబంధించిన నిర్ణయం మాత్రం నిర్మాతగారు తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం వెంకటేష్ సినిమా, ప్రభాస్ సినిమా కాకుండా విక్రమ్ హీరోగా చేస్తున్న సినిమాకు, చెన్నై టు సింగపూర్ అనే సినిమాకు, సందీప్ కిషన్, సి.వి.కుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు, జ్యోతిక ప్రధాన పాత్రలో నటించనున్న సినిమాకు మ్యూజిక్ అందించనున్నాను’’ అన్నారు.
Ghibran interview gallery |
|
|
|