నకమా ప్లానెట్ గ్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై తరుణ్ శెట్టి, అవంతిక, కిరిటీ దామరాజు, జెన్ని, భరణ్ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘మీకు మీరే మాకు మేమే’. హుస్సైన్ షా కిరణ్ దర్శకత్వం వహించిన చిత్రం ఈ జూన్ 17న విడుదలవుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు హుస్సైన్ షా కిరణ్ మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సినిమా గురించిన విశేషాలను తెలియజేశారు...
హుస్సైన్ షా కిరణ్ మాట్లాడుతూ ``మీకు మీరే మాకు మేమే చిత్రం ఓ పరిణితి లేని అబ్బాయి, పరిణితి ఉన్న అమ్మాయి మధ్య జరిగే ప్రేమకథ. దర్శకుడిగా ఇది నాకు తొలి సినిమా. ఆసక్తికరమైన కథనంతో సాగే రొమాంటిక్ ఎంటర్ టైనర్. ఈ సినిమా చేయడానికి ముందు నేను సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడిని. సినిమాల మీధ ఆసక్తి ఉండటంతో స్నేహితుల సలహాతో షార్ట్ ఫిలింస్ చేయడం మొదలు పెట్టాను. ఇలాంటి తరుణంలో నిర్మాత అల్లు అరవిండ్ గారి సపోర్ట్ మరచిపోలేం. సినిమా ఎలా తీయాలనే విషయంపై మాకు పూర్తి అవగాహన కల్పించారు. ఎక్కడ తప్పుల చేసేవారిమో చూసి మమ్మల్నే సరిదిద్దుకోమనేవారు. ఈ సినిమాకు ఫండింగ్ విషయంలో కూడా ఆయన సపోర్ట్ మరచిపోలేను. ఇలాంటి డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో సినిమా రాలేదనేది చెప్పగలను. అల్రెడి విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చింది. త్వరలోనే పెద్ద బ్యనర్ లో పెద్ద స్టార్ తో సినిమా చేస్తాను’’ అన్నారు.