విష్ణు మంచు హీరోగా నటించిన 'ఆచారి అమెరికా యాత్ర' చిత్రం ఏప్రిల్ 27న విడుదల కానుంది. జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించారు. విష్ణు, జి.నాగేశ్వర్ రెడ్డిల కలయికలో 'దేనికైనా రెడీ', 'ఈడో రకం ఆడో రకం' వంటి సూపర్ హిట్ కామెడీ చిత్రాలు ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్లో వస్తోన్న మూడో చిత్రమిది. స్టార్ కమెడియన్ బ్రహ్మానందం, విష్ణుల కాంబినేషన్ ఈ చిత్రానికి మరో హైలైట్ గా నిలవనుంది. విష్ణు సరసన ప్రజ్ఞ జైస్వాల్ జంటగా నటించిన ఈ చిత్రం కీర్తి చౌదరి మరియు కిట్టు 'పద్మజ పిక్చర్స్' బ్యానర్ పై నిర్మించగా యమ్.ఎల్. కుమార్ చౌదరి సమర్పిస్తున్నారు. సినిమా విడుదల సందర్భంగా హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ సినిమా గురించిన సంగతులను తెలియచేస్తూ...
పాత్ర గురించి...
- ఎన్నారై పాత్రలో కనపడతాను. ఓ కారణం చేత ఇండియాకు వస్తాను. క్రమంగా విష్ణుతో పరిచయం కావడం.. ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడం జరుగుతుంది. ఆ ప్రేమ కారణంగా అమెరికాకు ఎలా వస్తాడు? ఎలాంటి సమస్యలను ఫేస్ చేశాడు ? ఎలా సక్సెస్ అయ్యాడనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
దర్శకుడి గురించి...
- దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డిగారు మంచి కామెడీ టైమింగ్ ఉన్న డైరెక్టర్. ఆల్ రెడీ ఈయన దర్శకత్వంలో విష్ణు రెండు సూపర్హిట్ చిత్రాల్లో నటించారు. ఇప్పుడు అదే తరహాలో మంచి కామెడీ ఎంటర్టైనర్గా `ఆచారి అమెరికా యాత్ర మెప్పించనుంది.
interview gallery
దేవుడి దయ వల్ల బ్రతికాం...
- మలేషియాలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నప్పుడు అనుకోకుండా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఆ సమయంలో బైక్పై నేను, విష్ణు ఇద్దరం ఉన్నాం. ఇద్దరికీ దేవుడి దయ వల్ల ఏమీ కాలేదు.
ఇద్దరిలో తేడా అదే...
- నేను మంచు విష్ణు, మనోజ్లతో కలిసి నటించాను. మనోజ్ ఫన్ లవింగ్ పర్సన్ అయితే విష్ణు సీరియస్గా డిసిప్లెన్డ్గా ఉంటాడు. ఇద్దరూ మంచి స్నేహితులే.
ఇంకా నేర్చుకోవాలి...
- నటిగా వివిధ సినిమాల్లో నటిస్తున్నాను. వాటి వల్ల కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉన్నాను. ఇంకా చాలా విషయాలను నేర్చుకోవాల్సి ఉంది.
తదుపరి చిత్రాలు...
- చర్చల దశలో ఉన్నాయి. కన్ఫర్మ్ అయిన తర్వాత వాటి వివరాలను నేనే వెల్లడిస్తాను.