10 April 2016
Hyderabad
రమ్యశ్రీ ప్రధానపాత్రలో నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఓమల్లి’. ఆర్.ఎ.ఎంటైర్ టైన్మెంట్స్ బ్యానర్ ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం ఏప్రిల్ 15న విడుదల అవుతుంది. ఈ సందర్భంగా....
బి.రమ్యశ్రీ మాట్లాడుతూ ‘’డైరెక్షన్ చేయాలనే ప్యాషన్ తో ఓ మల్లి సినిమా చేయలేదు. చిన్నప్పుడు నేను చూసిన ఓ ఇన్ సిడెంట్ నా మదిలో అలాగే నిలిచిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం మహిళలు చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిని చూసినప్పుడు నా ఆలోచనకు శ్రీకారం చుట్టి ఓ మల్లి సినిమా చేశాను. ఓ మల్లి సినిమా లో మెసేజ్ తో పాటు మంచి కమర్షియిల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ సినిమాలో నేను ట్రైబల్ మహిళ పాత్రలో కనపడతాను. కథనుగుణంగా ఇందులో ఓ అమాయకపు స్త్రీ పాత్ర చుట్టూ తిరిగే పాయింట్ కాబట్టే ట్రైబల్ మహిళ పాత్ర చేయాలని నిర్ణయించుకున్నాను.
Ramya Sri interview gallery |
|
|
|
సినిమాలో నటించడం, ప్రొడక్షన్ చేయడం, డైరెక్షన్ చేయడం చాలా కష్టమైన విషయం అయినా అన్నీ నేనే కావడం వల్ల ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మంచి అవుట్ పుట్ తో సినిమా చేయగలిగాను. సినిమా చాలా రోజుల క్రిందటే పూర్తి అయ్యింది. అయితే కొన్ని వ్యక్తిగత కారణాలతో సినిమా విడుదల ఆలస్యం అయ్యింది. తర్వాత థియేటర్స్ సమస్య ఎదురైంది. దాంతో మరికొన్ని రోజులు విడుదల ఆలస్యమైంది. ఇప్పుడు అన్నీ సమస్యలు క్లియర్ కావడంతో సినిమాను ఏప్రిల్ 15న వంద థియేటర్స్ లో విడుదల చేస్తున్నాం. సినిమా ట్రైలర్స్, పోస్టర్స్ చూసి సినిమాకు మంచి అప్రిసియేషన్ వచ్చింది. నటన పరంగా ఇప్పటి వరకు ఓ నటి చేయని విదంగా నటించానని చాలెంజ్ చేసి చెప్పగలను. ఈ సినిమాలో 5 సాంగ్స్ ఉన్నాయి. చిత్రగారు, జేసుదాస్ గారు, కార్తీక్ పాటలను పాడారు. సినిమా ఫస్ట్ కాపీని చూశాను. కొంత మందికి ఈ సినిమాను చూపించాను. సినిమా చాలా బావుందని మెచ్చుకున్నాను. ఏప్రిల్ 15న సినిమా తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో విడుదలవుతుంది’’ అన్నారు.