శ్రీనివాసరెడ్డి, పూర్ణ హీరో హీరోయిన్లుగా ఎ.వి.ఎస్.రాజు సమర్పణలో శివరాజ్ ఫిలింస్ బ్యానర్పై శివరాజ్ కనుమూరి దర్శకత్వంలో శివరాజ్ కనుమూరి, సతీష్ కనుమూరి నిర్మాతలుగు రూపొందిన చిత్రం `జయమ్ము నిశ్చయమ్మురా`. ఈ సినిమా నవంబర్ 25న విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శివరాజ్ కనుమూరి పాత్రికేయులతో ముచ్చటించారు....
వారి స్ఫూర్తితోనే...
సీనియర్ వంశీ, బాపు, ప్రియదర్శన్, మణిరత్నం, రామ్గోపాల్ వర్మ వంటి స్టార్ డైరెక్టర్స్ స్ఫూర్తితోనే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాను. తూర్పుగోదావరి జిల్లా మట్టుపర్రు నా స్వస్థలం. కంపూటర్స్లో ఎమ్మెస్సీ చేసి లండన్ వెళ్లి నాలుగేళ్ల పాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేశాను. శివ, సత్య సినిమాలను చూసిన తర్వాత దర్శకుడు కావాలనే కోరిక బలంగా కలిగింది. ఇండియాకు వచ్చిన తర్వాత వర్మ కార్పొరేషన్లో అసిస్టెంట్గా కెరీర్ను స్టార్ట్ చేశాను. జయమ్మునిశ్చయమ్మురా చిత్రంతో దర్శకుడుగా మారాను...
Shiva Raj Kanumuri interview gallery
అందుకే ఆ క్యాప్షన్...
ప్రతి ఒక్కరికీ ఓ నెటివిటీ ఉంటుంది. మన చుట్టుపక్కల ఉండే వ్యక్తులు, వారి ప్రవర్తన, దాని వల్ల వచ్చే కామెడితో జయమ్ము నిశ్చయమ్మురా సినిమా చేశాను. ఎక్కడా పంచ్లు, ప్రాసలు ఉండాలనుకోలేదు. అలాగే ఓరిజినల్ లోకేషన్స్లోనే సినిమాను చిత్రీకరించాం. సినిమాను వీలైనంత సహజంగా ఉండేలా చూశాను. అందువల్ల ఈ సినిమాకు దేశవాళీ వినోదం అనే క్యాప్షన్ పెట్టాను.
సుకుమార్గారితో...
శ్రీనివాస్రెడ్డిగారు కథ వినగానే చేస్తారో, చేయరో ఏదో ఒకటి చెబుతారని ఎదురుచూశాను. కానీ శ్రీనివాసరెడ్డిగారు అడపా ప్రసాద్ క్యారక్టర్ ఎవరు చేస్తే బావుంటుంది. అలాగే తత్కాల్, గుంటూరు పంతులు ఇలాంటి క్యారెక్టర్స్ ఎవరు చేస్తే బావుంటుంది అని అడుగడం వల్ల ఆయన సినిమా చేయడానికి ఒప్పుకుని నెక్ట్స లెవల్కు వెళ్లిపోయారని అర్థమైపోయింది. ఈ సినిమా కోసం శ్రీనివాస్రెడ్డితో పాటు పోసాని, కృష్ణభగవాన్ వంటి సీనియర్స్తో పనిచేయడం చాలా ప్లస్ అయ్యింది. అలాగే సినిమా చూసిన సుకుమార్గారు, కొరటాల శివగారు, అనిల్ రావిపూడి, వక్కంతం వంశీ వంటివారు సినిమా చాలా బావుందని అప్రిసియేట్ చేశారు. సుకుమార్గారైతే తన బ్యానర్లో నా నెక్ట్స్ మూవీ చేయమని చెప్పారు. ఇప్పుడు సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నాను.