31 August 2017
Hyderabad
హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి దశాబ్దకాలంగా వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఢిల్లీ భామ శ్రియా శరన్. నందమూరి బాలకృష్ణ 101వ చిత్రం `పైసా వసూల్`లో హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం సెప్టెంబర్ 1 విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రియాశరన్తో ఇంటర్వ్యూ..
కథల ఎంపికలో తీసుకునే జాగ్రత్తలేంటి?
- నేను డైరెక్టర్ను బేస్ చేసుకుని, ఆయన నా క్యారెక్టర్ను ఎలా డిజైన్ చేశారు. కథ ఎలా ఉంది. కథను ఎలా ప్రెజెంట్ చేస్తారో, ఆయన ఆలోచనా విధానం ఏంటో ఇలాంటి విషయాలను ఆలోచిస్తాను. నా పాత్రని చూపించే విధానం నచ్చితే చాలు. ఎలాంటి హీరో, ఎలాంటి బ్యానర్ అనే విషయాలను పెద్దగా పట్టించుకోను.
పూరి జగన్నాథ్తో వర్కింగ్ ఎక్స్పీరియెన్స్ ఎలా ఉంది?
- నాకు ఎప్పటి నుండో పూరి జగన్నాథ్గారి దర్శకత్వంలో పనిచేయాలని కోరిక ఉండేది. ఈ సినిమా ఆ కోరిక నేరవేరింది. చాలా క్లారిటీతో కూల్గా తన వర్క్ను పూర్తి చేసే దర్శకుడు పూరి. నా క్యారెక్టర్ను చక్కగా ఎష్టాబ్లిష్ చేశారు. సినిమాలో మంచి ప్రేమకథ ఉంటుంది. కంప్లీట్ ఎంటర్టైనర్. అన్ని ఎమోషన్స్ ఉన్నాయి.
మీ పాత్ర ఎలా ఉంటుంది?
- ఈ సినిమాలో నేను ఓ ధైర్యమున్న జర్నలిస్ట్ పాత్రలో కనిపిస్తాను. నా పాత్ర బాలయ్యగారి పాత్రలో లింక్ అయ్యి కథలో భాగంగా రన్ అవుతుంటుంది.
గౌతమిపుత్ర శాతకర్ణి, పైసా వసూల్ వరుసగా రెండు డిఫరెంట్ సినిమాల్లో చేయడం ఎలా అనిపించింది?
- రెండు సినిమాలకు సంబంధించి బాడీ లాంగ్వేజ్లో కానీ, థర్డ్ ప్రాసెస్ కానీ వేరుగా ఉంది. రెండు వేర్వేరు జోనర్ మూవీస్ కాబట్టి ఎమోషన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి.
Shriya Saran interview gallery |
|
|
|
బాలకృష్ణతో నటించడం గురించి?
- బాలకృష్ణగారితో నేను చేస్తున్న మూడో సినిమా ఇది. ఆయనతో కలసి నటించిన ప్రతిసారి చాలా ఉత్సాహంగా ఉంటుంది. గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రంలో కూడా నటించాను. వెంటనే పైసావసూల్ చేశాను. ఈ సినిమాలో మా ఇద్దరి రోల్స్ చాలా సరదాగా ఉంటాయి. బాలయ్య క్యారెక్టర్ డిఫరెంట్గా ఉండి అందరినీ ఆకట్టుకుంటుందని నమ్మకంగా చెప్పగలను.
తదుపరి చిత్రాలు...
- తమిళంలో 23 ఏళ్ల కొత్త దర్శకుడితో ఓ చిత్రంలో నటించబోతున్నాను. సైకో థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రం రూపొందబోతోంది. సరికొత్త రోల్ లో ఈ చిత్రంలో కనిపిస్తాను.