నేను సునీల్, మన్నార్ చోప్రా హీరో హీరోయిన్లుగా ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన చిత్రం `జక్కన్న`. వంశీ కృష్ణ అకెళ్ళ దర్శకత్వంలో ఆర్.సుదర్శన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 29న సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన హీరో సునీల్ ఇంటర్వ్యూ...
సక్సెస్ రెస్పాన్స్ గురించి... - సినిమా సక్సెస్ కావడం చాలా హ్యాపీగా ఉంది. అన్ని చోట్ల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. నా కెరీర్లోనే నేను హీరోగా చేసిన సినిమాకు తొలిరోజునే మూడు కోట్ల 75 లక్షల రూపాయల ఓపెనింగ్ షేర్ రావడం చాలా పెద్ద గ్రేట్. నేను అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను.
ఇది రివ్యూ సినిమా కాదు... - ఒకట్రెండు సైట్స్లో రివ్యూస్ డివైడ్గా రాసినా బ్యాక్ టు ఎంటర్టైన్ తరహా మూవీ చేయడమే ఇలాంటి రెస్పాన్స్ రావడానికి కారణం. ముఖ్యంగా లేడీస్, ఫ్యామిలీస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా వరకు రివ్యూస్ మాకు పాజిటివ్గానే వచ్చాయి. ఇది రివ్యూస్ మూవీ కాదని అనుకుంటున్నాను.
దానికే ఇంపార్టెన్స్... - నేను కామెడికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. కథలో ఎక్కడైనా యాక్షన్ అవసరమైతే దాన్ని కూడా సిన్సియర్గానే చేస్తాను. కమెడియన్ నా కామెడి మిస్ అయిన వారి కోసం సాదారణంగా నేను కామెడి ఎలా చేస్తానో అలాగే జక్కన్న సినిమాలో చేశాను. ఎంటర్టైనింగ్ మూవీస్నే ఎక్కువగా చేయాలనుకుంటున్నాను.
Sunilinterview gallery
ఆ ఆలోచన నచ్చింది... - దర్శకుడు వంశీకృష్ణతో చాలా కాలంగా మంచి పరిచయం ఉంది. తను మెయిన్ పాయింట్ చెప్పినప్పుడు ఆ ఆలోచన నాకు నచ్చింది. ముఖ్యంగా ఇందులో పెద్ద ఫైట్స్ లేవు. నాకు నచ్చింది.. కథను తయారు చేయమన్నాను. తను తయారు చేసి నిర్మాత సుదర్శన్ రెడ్డిగారికి కూడా చెప్పాడు. ఆయనకు కూడా నచ్చడంతో సినిమా స్టార్ట్ చేశాం.
చిరంజీవితో సినిమా చేస్తున్నాను... - చిరంజీవిగారు, వినాయక్గారి కాంబినేషన్లో రానున్న సినిమాలో ముందు ఓ క్యారెక్టర్ చేయమని అడిగారు. అయితే అదే సమయంలో ఈడు గోల్డ్ ఎహే సినిమా క్లైమాక్స్ షూటింగ్ ఉండటంతో అన్నయ్యకు చెప్పాను. ఇప్పుడు ఆ సినిమాలోనే మరో క్యారెక్టర్ చేస్తున్నాను.
నెక్ట్స్ ప్రాజెక్ట్... - క్రాంతి మాధవ్గారి దర్శకత్వంలో ఓ సినిమా ఉంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్, లోగో అనౌన్స్ చేస్తాను. అలాగే వీరుపోట్ల గారి దర్శకత్వంలో ఈడు గోల్డ్ ఎహే అనే సినిమా చేస్తున్నాను.