24 August 2016
Hyderabad
ముప్పా క్రాంతి చిత్ర పతాకంపై రూపొందుతున్న చిత్రం `ఎవరు`. వెంకటరమణ సాళ్వ దర్శకుడు. తారకరత్న హీరోగా నటించారు. ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది.
తారకరత్న మాట్లాడుతూ ``ఈ నెల 26న సినిమాను విడుదల చేస్తాం. మా నిర్మాత ముప్పా అంకమ్మ చౌదరిగారు, రమణసాళ్వగారు చెప్పిన కథ నచ్చి నేను ఒప్పకున్నాను. నిర్మాత మా ఫ్యామిలీ మెంబర్. నాకు అన్నలాంటి వ్యక్తి. దర్శకుడు ఈ సినిమా కోసం వర్క్ షాప్లు కూడా చేశారు. ఇది ఫక్తు కమర్షియల్ చిత్రం కాదు. హారర్ థ్రిల్లర్. హీరో సుపీరియర్ కాదు. నార్మల్ స్టోరీ ఉంటుంది. అంతా రియల్గా అనిపిస్తుంది. నిర్మాతగారు చాలా కేర్ తీసుకుని చేశారు. సినిమా మొత్తం ఒకే ఇంట్లో పూర్తి చేశాం. మా దర్శకుడు చాలా పర్ఫెక్ట్ గా చిత్రీకరించారు. ఇప్పటిదాకా రవిబాబుగారిని నేను నా ఫేవరేట్ డైరక్టర్ అని చెప్పకునేవాడిని. ఆయన తర్వాత రమణసాల్వ కూడా ఇప్పుడు నా ఫేవరేట్ డైరక్టర్గా మారారు. పంచిబోరా చాలా మంచి పాత్ర చేసింది. నేను ఈ సినిమాలో ఆమెకు సపోర్ట్ చేస్తుంటాను. ఇందులో నా పాత్ర జర్నలిస్ట. ఇంతకు ముందు కూడా తారక్ చిత్రంలో జర్నలిస్ట్ గా చేశాను. తెలియని శక్తుల గురించి ఆరాతీసే సినిమా ఇది. చాలా బాగా వచ్చింది. ఇంతకు ముందు ఈ సినిమాకు యామినీ చంద్రశేఖర్ అని పేరు పెట్టాం. రషస్ చూసుకున్నాక మాకు సంతృప్తికరంగా అనిపించలేదు.
అందువల్ల మేం సగానికి పైగా రీ షూట్ చేశాం. ఎవరు అనే టైటిల్ పర్ఫెక్ట్ గా సరిపోతుందని పెట్టాం. నేను ఈ రంగంలోకి వచ్చినప్పుడే పర్టిక్యులర్గా ఒకే దానికి స్ట్రక్ కావాలని అనుకోలేదు. మంచి పాత్ర చేయాలని అనుకున్నాను. తారకరత్న అనగానే అందరికీ మంచి నటుడు గుర్తురావాలని అనుకున్నా. ఆ ప్రకారమే సినిమాలు చేస్తున్నాను. మనమంతా లాంటి సినిమాలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం నేను నటిస్తున్న రాజా మీరు కేక సినిమా పూర్తి కావచ్చింది`` అని చెప్పారు.
Glam gallery from the event |
|
|
|