సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్గా సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో సి.కె. ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లి. అధినేత సి.కళ్యాణ్ నిర్మించిన చిత్రం 'ఇంటిలిజెంట్'. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ ''సాయిధరమ్ తేజ్, వినాయక్ తొలి కాంబినేషన్లో రూపొందిన మా 'ఇంటిలిజెంట్' చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. అందర్నీ ఆకట్టుకునే అన్ని ఎలిమెంట్స్తో రూపొందిన ఈ సినిమా మా బేనర్లో మరో సూపర్హిట్ మూవీ అవుతుంది. సాయిధరమ్తేజ్ పెర్ఫార్మెన్స్ హైలైట్గా వినాయక్ ఎక్స్ట్రార్డినరీ టేకింగ్తో రూపొందిననీ సినిమా డెఫినెట్గా సూపర్హిట్ అవుతుంది'' అన్నారు.