సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా బివిఎస్ రవి దర్శకత్వం వహిస్తున్నచిత్రం జవాన్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన పాటలకు ట్రైలర్ కు అద్భుతమైన స్పందన లభించింది. సాయి ధరమ్ తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారీ ప్రమోషన్స్ నడుమ డిసెంబర్ 1న జవాన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంలో జవాన్ చిత్ర యూనిట్ డైరెక్టుగా అభిమానుల్ని, ప్రేక్షకుల్ని పలకరించనుంది. ఈ టూర్ లో హీరో హీరోయిన్ డైరెక్టర్ తో పాటు ఇతర చిత్ర యూనిట్ పాల్గొంటుంది. భారీ అంచనాల మధ్య విడుదలౌతున్న జవాన్ టూర్ షెడ్యూల్ విషయానికి వస్తే......
Tuesday (28th) morning
9:30am : Dwaraka Tirumala,
11am : Maddi AnjaneyaSwamy temple, Jangareddygudem
1:30pm : interaction with Ramachandra Engineering collage Students in Eluru.
4pm : Vijayawada Durgamma Dharshanam
5 pm : Press meet @ Vijayawada
భారీ అంచనాల మధ్య జవాన్ విడుదలౌతోంది. అంతే కాదు.. విడుదలకు ఒక రోజు ముందుగానే ఈ చిత్ర ప్రీమియర్ షోను హైదరాబాద్ లని ప్రముఖ థియేటర్లో ప్లాన్ చేశారు. ఈ ప్రీమియర్ షో చూసేందుకు సినీ సెలెబ్రిటీస్, మీడియా తో పాటు కొంతమంది అభిమానులకు కూడా అవకాశం కల్పించారు. సినిమా మీదున్న నమ్మకంతోనే ప్రీమియర్ షోను ప్లాన్ చేశారు.
నటీనటులు - సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్, ప్రసన్న , జయప్రకాష్, ఈశ్వరీ రావ్ తదితరులు
కెమెరా మెన్ - కెవి గుహన్
మ్యూజిక్ - తమన్
ఆర్ట్ - బ్రహ్మ కడలి
ఎడిటింగ్ - ఎస్.ఆర్.శేఖర్
సహ రచయితలు - కళ్యాణ్ వర్మ దండు, సాయి కృష్ణ, వంశీ బలపనూరి
బ్యానర్ - అరుణాచల్ క్రియేషన్స్
సమర్పణ - దిల్ రాజు
నిర్మాత - కృష్ణ
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ - బివిఎస్ రవి