ఇటీవల కాలం లో సస్పెన్స్ ప్రధానం గా వచ్చిన సినిమా "క్షణం". ప్రపంచవ్యాప్తం గా ఉన్న తెలుగు ప్రేక్షకుల నుండి టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీస్ వరకు అందరినీ ఈ సస్పెన్స్ థ్రిల్లర్ క్షణ క్షణం ఉత్కంఠకు గురిచేసింది. బాలీవుడ్ లో ఒక ప్రొడక్షన్ సంస్థ నడియాద్వాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు, తమిళ్ లో అభిషేక్ పిక్చర్స్ వారు "క్షణం" సినిమా రీమేక్ రైట్స్ కొనడం విశేషం.
"క్షణం" సినిమాను జీరో బడ్జెట్ లో చేద్దామని ఈ సినిమా రచయిత అడివి శేష్, దర్శకుడు రవికాంత్ పేరేపు అనుకున్నారు. కానీ కధ నచ్చడంతో PVP సంస్థ వారు "క్షణం" సినిమాను ప్రొడ్యూస్ చేసారు. అతి తక్కువ బడ్జెట్ లో, టాలెంటెడ్ క్రూ తో షూటింగ్ చేసిన "క్షణం" సినిమాను చూస్తే ఎక్కడా తక్కువ బడ్జెట్ అని అనిపించకుండా తీసారు. ఇప్పుడు అసలు "క్షణం" సినిమా ఎలా వచ్చింది, షూటింగ్ ఎలా చేసారు అన్నది ఆ సినిమా టెక్నీషియన్స్ చెప్పిన విశేషాలను ఒక వీడియో గా చేసి "జర్నీ అఫ్ క్షణం" అని విడుదల చేసారు.
అడివి శేష్, అదా శర్మ, అనసూయ భరద్వాజ్, సత్యదేవ్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, రవి వర్మ తదితరులు నటించారు. స్టొరీ : అడివి శేష్, ఎడిటింగ్ : అర్జున్ శాస్త్రి, రవికాంత్ పేరేపు, సినిమాటోగ్రఫి : షనిల్ డియో, సాహిత్యం : సిరాశ్రీ, రామజోగయ్య శాస్త్రి, మ్యూజిక్ : శ్రీచరణ్ పాకాల, డైలాగ్స్, స్క్రిప్ట్ గైడెన్స్ : అబ్బూరి రవి, నిర్మాత : పరమ్. వి పొట్లూరి, కెవిన్ అన్నె, దర్శకత్వం : రవికాంత్ పేరేపు.