08 December 2015
Hyderabad
‘కేడి బిల్లా-కిలాడి రంగా’ డబ్బింగ్ పూర్తి!!
సూపర్ సక్సెస్ఫుల్ తమిళ డైరెక్టర్ పాండిరాజ్ దర్శకత్వంలో రూపొంది.. ఘన విజయం సాధించిన తమిళ చిత్రం ‘కేడి బిల్లా-కిలాడి రంగా’ అదే పేరుతో తెలుగులో అనువాదమవుతుండడం తెలిసిందే. రాజ్ కందుకూరి సమర్పణలో.. భీమవరం టాకీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా వెలుగొందుతున్న రెజీనా ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ కాగా.. కోలీవుడ్లో లీడింగ్ హీరోయిన్గా పేరు గడించిన మన తెలుగమ్మాయి బిందుమాధవి మరో హీరోయిన్. విమల్-శివకార్తికేయన్ హీరోలుగా నటించిన ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం యువన్ శంకర్రాజా స్వర సారధ్యం వహించారు. ఈ చిత్రం అనువాద కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. త్వరలో పాటలు విడుదల కానున్నాయి.
ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘నేను అభిమానించే నిర్మాతల్లో రామసత్యనారాయణగారు ఒకరు. ఆయనతో అసోసియేట్ అవ్వాలని చాలా రోజులుగా అనుకుంటున్నా.. అది ఇప్పటికి కుదిరింది. తమిళంలో సూపర్హిట్టయిన ‘కేడి బిల్లా-కిలాడి రంగా’ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం కచ్చితంగా తెలుగులోనూ ఘన విజయం సాధిస్తుంది’ అన్నారు. భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ‘రాజ్ కందుకూరిగారి సమర్పణలో ‘కేడి బిల్లా-కిలాడి రంగా’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయనది గోల్డెన్ హ్యాండ్. రెజీనా, బిందుమాధవిల గ్లామర్, విమల్, శివకార్తికేయన్ల పెర్ఫార్మెన్స్, పాండిరాజ్ దర్శకత్వ ప్రతిభ, యువన్ శంకర్రాజా సంగీతం ‘కేడి బిల్లా-కిలాడి రంగా’ చిత్రానికి ముఖ్య ఆకర్షణలు. త్వరలోనే ఆడియో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.
ఈ చిత్రానికి మాటలు: కృష్ణతేజ, పాటలు: పోతుల రవికిరణ్, ఎడిటింగ్: డా॥శివ వై.ప్రసాద్, ఆడియోగ్రఫి: శేషు కె.యం.ఆర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి.సత్యనారాయణ, మ్యూజిక్: యువన్ శంకర్రాజా, సమర్పణ: రాజ్ కందుకూరి, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-స్క్రీన్ప్లే-దర్శకత్వం: పాండిరాజ్!!