28 January 2016
Hyderabad
వినోదాన్ని నమ్ముకుని కొత్తవారితో లిమిటెడ్ బడ్జెట్ లో చిత్రాన్ని నిర్మిస్తే తప్పకుండా తెలుగు ప్రేక్షకులు విజయాన్ని అందిస్తారనే గట్టి నమ్మకంతో రత్న ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రసాద్ కుమార్, శ్రీను విజ్జగిరి లు నిర్మాతలుగా నవకళ వారి బ్యానర్ లో సంయుక్తగా నిర్మిస్తున్న చిత్రం కత్రీన కరిన మద్యలో కమల్హసన్ . ఈ ఈ చిత్రం లో శశాంక్ మౌళి, పావని, మమత రావూత్ లు హీరోహీరోయిన్స్ గా పరిచయం అవుతున్నారు. శ్రీకర్ సంగీతం అందిస్తున్న ఆడియె ని త్వరలో విడుదల చేసి చిత్రాన్ని సమ్మర్ లో వినోదం అందించమే లక్ష్యం గా విడుదల చేస్తారు.
ఈ సందర్బంగా నిర్మాతలు మాట్లాడుతూ.. చిన్న చిత్రం పెద్ద చిత్రం అనే తేడా లేకుండా వినోదాన్ని అందించే ప్రతి చిత్రానికి తెలుగు ప్రేక్షకులు విజయాన్ని అందించారు, అదే ఫార్ములా ని నమ్ముకున్న మా దర్శకుడు రత్న యూత్ కి నచ్చే చక్కటి వినోదాత్మక కథ ని మంచి కథనంతో వినోదాత్మకంగా చెప్పారు. మాకు చెప్పిన దాని కంటే వినోదాన్ని మరో వంతు ఎక్కువుగా అందించి తెరకెక్కించారు. ఈ చిత్రం షూటింగ్ ని పూర్తిచేసకుంది. త్వరలో శ్రీకర్ అందించిన ఆడియోని విడుదల చేసి చిత్రాన్ని విడదల చేయనున్నాము. సమ్మర్ లో విడుదలయ్యో మెట్టమెదటి వినోదాత్మక చిత్రం గా ఈ చిత్రం విడుదలవుతుంది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. అని అన్నారు
దర్శకుడు రత్న మాట్లాడుతూ.. నా కథని నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన నా నిర్మాతలకి ధన్యవాదాలు. అలాగే నవ్వించమే టార్గెట్ గా పెట్టుకుని చేస్తున్నాను. చిత్రం కంప్లీటయ్యింది. ఈ జెనరేషన్ లో అమ్మాయిలు, అబ్బాయిలు పెళ్ళికి ముందు ఎలా ఆలోచిస్తారు.. ఎలాంటి పార్టనర్ ని కోరుకుంటారో వినోదాత్మకంగా తెరకెక్కించాం. సమ్మర్ కి చిత్రాన్ని విడుదలవుతుంది. ధియెటర్ కి వచ్చిన ప్రేక్షకులని నవ్విస్తామనే నమ్మకం మాకుంది.. అని అన్నారు..
శశాంక్ మౌళి, పావని, జీవ, అనంత్, ఖయ్యుం, చిత్రం శీను, రకెట్ రాఘవ, కృష్ణంరాజు, ఆకెళ్ళ, జబర్ధస్థ్ మహేష్, జబర్ధస్థ్ శ్రీథర్, జబర్ధస్థ్ మురళి, జబర్ధస్థ్ జీవన్, విజయ్, నవీన్, యాన్ని తదితరులు...
మాటలు.. వి.యస్.పి.తెన్నెటి, సంగీతం.. శ్రీకర్, ఫోటోగ్రఫి.. ప్రసాద్, శ్రావణ్ కుమార్, సహ-నిర్మాతలు.. యస్.మల్లయ్య, బి.జగన్, నిర్మాతలు.. ప్రసాద్ కుమార్ , శ్రీను విజ్జగిరి, దర్శకత్వం.. రత్న