డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇషాన్ హీరోగా జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్ పతాకంపై డా|| సి.ఆర్.మనోహర్, సి.ఆర్.గోపి నిర్మిస్తున్న లవ్ ఎంటర్టైనర్ 'రోగ్'(మరో చంటిగాడి ప్రేమకథ). ఈ సినిమా మార్చి 31న వరల్డ్వైడ్గా తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా హీరోయిన్స్ మన్నారా చోప్రా, ఎంజెలా మీడియాతో మాట్లాడారు.....
మన్నారా చోప్రా మాట్లాడుతూ - ``ఏస్ డైరెక్టర్ అయిన పూరి జగన్నాథ్గారి డైరెక్షన్లో సినిమా చేయాలని అనుకోగానే చాలా థ్రిల్ ఫీలయ్యాం. ఆయన సినిమాలో చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. మార్చి 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో చాలా ఎగ్జయిటింగ్గా ఉన్నాం. పూరిగారిని విమానంలో కలిశాను. ఆయన నాతో బాగా మాట్లాడారు. ఆ సమయంలో పూరిగారు నా నెంబర్ కూడా తీసుకున్నారు. ఈ సినిమా కోసం నన్ను ఆడిషన్కు రమ్మని పిలిచారు. ఆడిషన్స్ పూర్తైన తర్వాత రోగ్ సినిమాలో నువ్వే లీడింగ్ హీరోయిన్వి అని పూరిగారు నాకు చెప్పారు. అలా నాకు రోగ్ సినిమాలో అవకాశం వచ్చింది. రోగ్ సినిమాలో నేను సింగ్ పాత్ర చేశాను. రొమాంటిక్ మూవీ. పూరిగారు సినిమాను అందంగా తీర్చిదిద్దారు. అన్నీ ఎలిమెంట్స్తో సినిమాను బాగా తెరకెక్కించారు., ఇషాన్ చాలా సిగ్గరి. అమ్మాయిలతో మాట్లాడాలంటే చాలా భయపడుతుంటాడు. సినిమాలో పనిచేసిన వారందరం ఒక ఫ్యామిలీలాగా కలిసిపోవడంతో ఏదో ట్రిప్కు వచ్చినట్లుగా ఫీల్ కలిగింది. పూరి జగన్ గారి స్టైల్ డైలాగ్స్ ఉంటాయి. సినిమాను పూరిగారి స్టైల్లో ఉంటుంది`` అన్నారు.
ఎంజెలా మాట్లాడుతూ - ``సినిమాలో అంజలి అనే పాత్రలో నటించాను. పూరి వంటి స్టార్ డైరెక్టర్ సినిమాలో నటించడం హ్యాపీగా అనిపించింది. రోగ్ కంప్లీట్ మాస్ మసాలా కమర్షియల్ మూవీ. ఇషాన్ చాలా మంచి కోస్టార్. హీరోయిన్గా నా తొలి చిత్రమిది. జ్యోతిలక్ష్మీ, సైజ్ జీరో చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్లో నటించాను. మార్చి 31న విడుదలవుతున్న ఈ సినిమాను పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను`` అన్నారు.