|
24 August 2015
Hyderabad
నూతన తారలతో ‘మట్టి’
సుందర్ ప్రొడక్షన్స్ పతాకంపై నూతన నటీనటులతో డా.బి.ప్రసాదరావు దర్శకత్వంలో మహమ్మద్ అజీద్అలీ రూపొందిస్తున్న చిత్రానికి ‘మట్టి’ అనే పేరును ఖరారు చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ అందరూ కొత్త తారలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, సెప్టెంబర్ మొదటివారంనుండి షూటింగ్ ప్రారంభించి, రెండు షెడ్యూల్స్లో బ్యాంకాక్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పూర్తిచేస్తామని, నవంబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. రెండు మధ్యతరగతి కుటుంబాల మధ్య సాగే భావోద్వేగాల సమాహారంగా లవ్, కామెడీ, సెంటిమెంట్ ఎంటర్టైనర్గా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్తో రూపొందిస్తున్నామని, రెండు షెడ్యూల్స్లో రూపొందించే ఈ చిత్రంలో మూడు పాటలను ఇప్పటికే రికార్డ్ చేశామని వారు తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రానికి కెమెరా: నాగేంద్రకుమార్, పాటలు: ఇర్పు నాగేశ్వరరావు, మంద బాలకృష్ణ, నిర్మాత: మహమ్మద్ అజీద్ అలీ, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: డా.బి.ప్రసాదరావు.
|
|
|
|
|