pizza
Mohan Babu condolences to Rajahmundry Pushkar ghat victims
You are at idlebrain.com > news today >
Follow Us

14 July 2015
Hyderabad

పుష్కరాల్లో మృతి చెందిన కుటుంబాలకు మోహన్ బాబు సానుభూతి

తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలోని గోదావరి పుష్కరఘాట్ మొదటి ప్రవేశ ద్వారం వద్ద జరిగిన తొక్కిసలాటలో 27 మంది భక్తులు మృతి చెందగా, పలువురి గాయాలయ్యాయి. గాయపడిన వారికి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై నటుడు, నిర్మాత మోహన్ బాబు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకున్నప్పటికీ పుష్కర సమయంలో ఇటువంటి ఘటన జరగడం బాధగా ఉంది. మృతుల కుటుంబాలకు నా ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నాను. భక్తులు కూడా తగు జాగ్రత్తలు తీసుకుని పుష్కరాల్లో క్షేమంగా ఉండాలి. భక్తులు పోలీసులు, అధికారులకు సహకరించండని అన్నారు.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved