19 April 2015
Hyderabad
కిరణ్ , ధనరాజ్ , హరిణి , పింకి ప్రియ ముక్య పాత్రల్లో సత్యం ముప్పిడి దర్శకత్వం లో సృజన ఆర్ట్ క్రియేషన్స్ పతాకం పై రూపొందుతున్న చిత్రం మూర్కుడు. ఇటివలే చివరి షెడ్యుల్ తో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఈ సందర్బంగా చిత్ర వివరాలను గురించి నిర్మాత డా . సి వి రత్న కుమార్ మాట్లాడుతూ .. సంచలన దర్శకుడు వర్మ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. ఇప్పటివరకు అయన పై చాలా చిత్రాలు వచ్చాయి, కాని ఇది బిన్నంగా ఉంటుంది. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బాగంగా డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో చంద్రమోహన్ తన సినీ కెరీర్ లో మొదటి సారిగా బాబా పాత్రలో నటిస్తున్నాడు. చంద్రమోహన్ ధనరాజ్ ల మద్య వచ్చే కామెడి అందరిని అలరిస్తుంది. దర్శకుడు సత్య ముప్పిడి చక్కగా తెరకెక్కిస్తున్నారు. మే లో ఆడియో ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.
దర్శకుడు సత్య ముప్పిడి మాట్లాడుతూ ... వర్మ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా అన్ని రకాల కమర్షియల్ అంశాలతో రుపొందిస్తున్నాం. ఇటివలే చంద్రమోహన్ , తదితరులు పాల్గొనగా కీలక సన్నివేశాలు చిత్రికరించం. దీంతో షూటింగ్ మొత్తం పూర్తయ్యింది అన్నారు.
చంద్రమోహన్ , స్మైలీ, ఉమా రెడ్డి, గోవర్దన్, నవీన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ , మాటలు - ఆకుల ఉదయ్ కుమార్ , కెమెరా - కే . జగదీశ్, సంగీతం - నవనీత్ చారి, పాటలు - భాషా శ్రీ , నిర్మాత - డా . సి వి రత్న కుమార్, దర్శకత్వం - సత్యం ముప్పిడి.