12 December 2016
Hyderabad
కావేరి ట్రావెల్స్ సమర్పణలో కావేరి మీడియా బ్యానర్పై నవీన్ సంజయ్ హీరోగా నటించిన చిత్రం `జానకి రాముడు`. మౌర్యాని, ప్రియాంక నాయికలు. తమ్మినీడి సతీష్ బాబు దర్శకత్వం వహించారు. యం.పి.నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 16న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ మౌర్యాని మాట్లాడుతూ - ``నేను పుట్టి, పెరిగిందంతా బెంగళూరులోనే. జానకిరాముడు సినిమా నా రెండో సినిమా. జానకి అనే సంప్రదాయక, గ్రామీణ అమ్మాయిగా నటించాను. నా జానకి పాత్ర ఆడియెన్స్కు గుర్తుండి పోతుంది. సినిమా మంచి క్యూట్, బ్యూటీఫుల్ లవ్స్టోరీ. పాలకొల్లు, రాజమండ్రి, అరకు, హైదరాబాద్ ప్రాంతాల్లో చిత్రీకరించారు. అర్థనారి సినిమాలో నేను నటిస్తున్నప్పుడు డైరెక్టర్ తమ్మిడినీడి సతీష్బాబుగారు చూసి నాకు `జానకిరాముడు` సినిమాలో హీరోయిన్గా అవకాశం ఇచ్చారు. జానకిరాముడు సినిమాలో నా పాత్రకు అందరికీ నచ్చుతుంది. డైలాగ్స్ హృదయానికి హత్తుకుంటాయి. గిఫ్టన్ ఎలియాస్గారు అందించిన పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. నవీన్ సంజయ్ చాలా ఫ్రెండ్లీ ఆర్టిస్ట్. ప్రతి సీన్లో నటించేటప్పుడు ఇద్దరం డిస్కస్ చేసుకుని నటించేవాళ్లం. నిర్మాత యం.పి.నాయుడుగారు సినిమా క్వాలిటీ కోసం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. సినిమా ఇంత బాగా రావడానికి ఆయనే ముఖ్య కారణం`` అన్నారు.
Mouryaani interview gallery |
|
|
|