pizza
Nani - Mohan Krishna Indraganti film in last schedule
చిత్రీకరణ తుది దశకు చేరుకున్న నాని-మోహనకృష్ణ ఇంద్రగంటి చిత్రం
You are at idlebrain.com > news today >
Follow Us

1 April 2016
Hyderaba
d

'అష్టా చమ్మా' తర్వాత నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతోంది. 'ఆదిత్య 369', 'వంశానికొక్కడు' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సురభి, నివేదా థామస్ కథానాయికలు. ఈ చిత్రం ఆఖరు షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.

ఈ సందర్భంగా శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ - ''ఇదొక అందమైన రొమాంటిక్ థ్రిల్లర్. థ్రిల్ కు గురి చేసే ఎలిమెంట్స్, మంచి రొమాన్స్, సెంటిమెంట్, వినోదం.. ఇలా అన్ని అంశాలు కుదిరిన కథ. అతి త్వరలోనే టైటిల్ ప్రకటిస్తాం. డిసెంబర్ 2న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించాం. హైదరాబాద్, కొడైకెనాల్ లో షెడ్యూల్స్ జరిపాం. ఫిబ్రవరి 14 నుంచి మార్చి 6 వరకూ కొడైకెనాల్ లో జరిపిన షెడ్యూల్ లో ఒక పాట, కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. మార్చి 14న హైదరాబాద్ లో షెడ్యూల్ మొదలుపెట్టాం. ఏప్రిల్ 6 వరకూ ఈ షెడ్యూల్ జరుగుతుంది. ఈ షెడ్యూల్లో ఇంపార్టెంట్ టాకీ, ఒక పాట చిత్రీకరిస్తాం. దాంతో షూటింగ్ పూర్తవుతుంది. ఏప్రిల్ రెండో వారంలో డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెడతాం. మే నెలాఖరున లేక జూన్ మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం'' అని తెలిపారు.

అవసరాల శ్రీనివాస్, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్, ఆనంద్, రోహిణి, 'సత్యం' రాజేశ్, రమాప్రభ, ప్రగతి, రాజశ్రీ నాయర్, శ్రీముఖి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: డేవిడ్ నాథన్, సంగీతం: మణిశర్మ, కెమేరా: పి.జి. విందా, ఆర్ట్: ఎస్. రవీందర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్, కో-డైరెక్టర్: కోట సురేశ్ కుమార్, నిర్మాణ పర్యవేక్షణ: యోగానంద్, నిర్మాణ నిర్వహణ: పరుచూరి మోహన్, రషీద్ అహ్మద్, స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved