`పులి` చిత్రంలో ఖాకీ యూనిఫార్మ్ లో అలరించిన భామ నికిషా పటేల్. ఆ తర్వాత అడపాదడపా తెలుగు సినిమాలు చేసింది. తాజాగా మరోసారి ఖాకీ యూనిఫార్మ్ లో కనిపించబోతోంది. సాయిరామ్శంకర్ సరసన ఆమె నటించిన అరకు రోడ్లో శుక్రవారం విడుదల కానుంది. ఈ సినిమా గురించి నికిషా పటేల్ గురువారం హైదరాబాద్లో మాట్లాడారు.
నికిషా పటేల్ మాట్లాడుతూ ``సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. ఒక ట్రక్ డ్రైవర్ జీవితంలో జరిగిన అంశాల సమాహారంగా ఉంటుంది. నేను పోలీసు పాత్రలో కనిపిస్తాను. తొలి రోజు పోలీస్ డ్రెస్లో స్పాట్కు రాగానే చుట్టూ ఉన్న వారు ఈలలు వేయసాగారు. పవన్ కల్యాణ్ గారితో చేసిన `పులి`ని ఇంకా మర్చిపోలేదని అర్థమైంది.అందులోలాగానే ఇందులోనూ కామెడీ పోలీస్గా చేశాను. ఇందులో మరింత యారోగెంట్గా, సెల్ఫ్ సెంటర్డ్ గా, డామినేటింగ్గా కనిపిస్తాను. నేను `పులి తర్వాత `ఓమ్ త్రీడీ`లో చేశాను. ఆ తర్వాత నటించిన `రమ్` మధ్యలో ఆగింది. సిమ్రన్తో చేసిన `లీలా` విడుదలకు సిద్ధంగా ఉంది. తమిళ, కన్నడలో నటిస్తున్నాను. తమిళంలో `ఏళు నాట్కల్` చేశాను. మిత్రన్ జవహర్ దర్శకత్వంలో మరో చిత్రం ఉంది. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాను. లాస్ ఏంజెల్స్ లో స్థిరపడి ఇంగ్లిష్ చిత్రాల్లో నటించాలనుకుంటున్నాను`` అని తెలిపారు.