pizza
Ninne Pelladatha talkie part completed
టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న"నిన్నే పెళ్లాడతా"
You are at idlebrain.com > news today >
Follow Us

31 October, 2019
Hyderabad

ఈశ్వరి ఆర్ట్స్ పతాకంపై అమన్(రకుల్ ప్రీత్ సింగ్ బ్రదర్) ,సిద్ధిక హీరోహీరోయిన్లుగా వైకుంఠ బోను దర్సకత్వంలో బొలినేని రమ్య, వెలుగోడు శ్రీధర్ బాబు లు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం " నిన్నే పెళ్లాడతా". శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ప్రస్తుతం టాకీ పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ " మంచి కమర్షియల్ హంగులున్న యాక్షన్ చిత్రమిది. హీరోహీరోయిన్లులతో పాటు సాయికుమార్, సీత, ఇంద్రజ ల నటన ఈ చిత్రంలో హైలెట్ గా వుంటుంది. మంచి ఎమోషన్స్ తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది మా చిత్రం. రెండు పాటలు, రెండు ఫైట్స్ మినహా టాకీ మొత్తం పూర్తయ్యింది. డిసెంబరు ఎండింగ్ లో సినిమా రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం"అన్నారు. అమన్,సిద్ధిక, సాయికుమార్, సీత, ఇంద్రజ, అన్నపూర్ణ, యోగి,కబీర్ సింగ్, విజ్జులేఖ, రామన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:నవనీత్, కెమెరా:ప్రసాద్ వీవీఎస్ఎన్, ఫైట్స్:రామకృష్ణ, డాన్స్:కళాధర్, విజయ్, సహ నిర్మాత:సాయి కొనెరి, నిర్మాతలు:బొలినేని రమ్య, వెలుగోడు శ్రీధర్ బాబు, కధ, స్క్రీన్ ప్లే,దర్శకత్వం:వైకుంఠ బోను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved