17 June 2017
Hyderabad
మధురం మూవీ క్రియేషన్స్ పతాకంపై, 'కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో' దగ్గుపాటి వరుణ్ సమర్పణలో మాధవి అద్దంకి నిర్మిస్తున్న చిత్రం 'నేను కిడ్నాప్ అయ్యాను'.
నిర్మాత మాధవి అద్దంకి గారు మాట్లాడుతూ షూటింగ్ పార్ట్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగించుకుని ప్రస్తుతం సెన్సార్ వర్క్స్ చేస్తున్నాము. డైరెక్టర్ శ్రీకర్ బాబు గారు చాల బాగా ఈ సినిమా తీశారు. మా చిత్రం ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకం నాకుంది" అన్నారు.
దర్శకుడు శ్రీకర్ బాబు మాట్లాడుతూ చిత్రం అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. మా చిత్రం కోసం ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ మమ్మల్ని సంప్రదిస్తున్నారు. చిత్రానికి పని చేసిన యూనిట్ సభ్యులందరు చాల బాగా సపోర్ట్ చేశారు. బ్రహ్మానందం గారు, పోసాని గారు, తాగుబోతు రమేష్ గారు చాలా బాగా సహకరించారు. మా చిత్ర నిర్మాత మాధవి అద్దంకి గారు మాకు చాలా సపోర్ట్ చేశారు. మా వెన్నంటి ఉండి మాకు షూటింగ్ కి కావలసిన ఏర్పాట్లన్నీ చేశారు. సెన్సార్ కార్యక్రమాలు ముగించుకుని జులై లో సినిమా రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నాము" అన్నారు.
ఈ చిత్ర సమర్పకులు దగ్గుపాటి వరుణ్ మాట్లాడుతూ "ఈ చిత్రం అవుట్ పుట్ చూసాను. చాలా బాగా వచ్చింది. దాంతో నేను కూడా భాగస్వామిని కావాలని నిర్ణయించుకున్నాను. జులై లో రిలీజ్ కాబోతున్న మా చిత్రం ప్రేక్షకుల అభిమానం కచ్చితంగా సంపాదిస్తుంది " అన్నారు.
ఆర్టిస్ట్స్: బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, "కార్టూనిస్ట్" మల్లిక్, పృథ్వి, రఘు బాబు, కృష్ణ భగవాన్, తాగుబోతు రమేష్, మేల్కొటే, సత్య, కోట శంకర రావు, సత్యానంద్, శ్రీకాంత్, ధీరేంద్ర, హర్ష కృష్ణ మూర్తి ,విశాల్, సౌమిత్రి, మహిమ కొఠారి, అదితి సింగ్, తేజు రెడ్డి, బిందు బార్బీ, సప్నా.
టెక్నీషియన్స్: కథ - దర్శకత్వం : శ్రీకర్ బాబు, స్క్రీన్ ప్లే : దివాకర్ బాబు, డైలాగ్స్ : మల్లిక్, మ్యూజిక్ : శ్రీకాంత్, లిరిక్స్ : గంగోత్రి విశ్వనాధ్, ప్రొడ్యూసర్ : మాధవి అద్దంకి.