'మంత్ర, మంగళ' వంటి చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు ఓషో తులసీరామ్..త్వరలో ఎమ్.ఎమ్. మూవీ మేకర్స్ పతాకంపై ఓ నూతన చిత్రానికి శ్రీకారం చుట్టారు. అర్చన(వేద) ప్రధాన పాత్రలో జైలు బ్యాక్డ్రాప్లో తెరకెక్కనున్న ఈ చిత్రం అక్టోబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ప్రస్తుతం ఇతర నటీనటుల ఎంపిక జరుగుతుంది.