30 November 2015
Hyderabad
“పాకశాల సీనిమా మొదటి కాపీ తయారైనప్పటికి, అప్పటినుండి అయిదు నెలలు సుదీర్ఘ ప్రయాణం పోరాటం తో ఎట్టకేలకు సెన్సార్ అభ్యంతరాలను ట్రిబునల్ స్థాయి లో అధిగమించి సాధించామని, ఈ సందర్భంగా ట్రిబ్యునల్ చైర్ పర్సన్ రిటైర్డ్ జస్టిస్ శ్రీమతి రేవా ఖేత్రపాల్ మరియు బోర్డు మెంబెర్స్ బీన గుప్త, శేఖర్ అయ్యర్, విపిన్ గోగియా మరియు రీజినల్ ఆఫీసర్ శ్రీ విజయ కుమార్ రెడ్డి గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు అని చిత్ర నిర్మాతలు రాజ్ కిరణ్, అర్ పీ రావు తెలిపారు. “ఐశ్వర్య సినీ స్టూడియో” పతాకం పై నూతన దర్శకుడు ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం లో రూపుదిద్దుకున్న చిత్రం “పాకశాల”. ఈ చిత్రం గత కొద్ది నెలలుగా వివాదాస్పద పరిణామాల మధ్య సెన్సార్ ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలిసిందే. విశిష్టమైన కధాంశంతో ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రానికి ఆది నుండి ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. వంటగది నేపధ్యం లో సాగే ఈ కధ లో ఉన్న ప్రత్యేకత, విశిష్టత తెల్సుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే అంటున్నారు చిత్ర నిర్మాతలు. డిసెంబర్ లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని చిత్ర బృందం పత్రికా సమావేశం లో తెలిపారు.
విశ్వ, శ్రీనివాస్, జగదీష్ రెడ్డి, కీర్తి, అర్పిత, వైజాగ్ ప్రసాద్, ముఖ్యపాత్రధారులుగా తెరకెక్కిన ఈ చిత్రానికి కధ: గురు కిరణ్, సంగీతం: శ్రవణ్.S.మిక్కీ, సాహిత్యం: హరీష్ చక్ర సతీష్, ఛాయాగ్రహణం: భారద్వాజ్ దాసరి.