23 August 2016
Hyderabad
క్రాంతి చిత్ర బ్యానర్ పై తారకరత్న కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం `ఎవరు?`. రమణ సెల్వ దర్శకత్వంలో ముప్ప అంకమ్మ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్ 26న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ పంచీబోరా విలేఖరులతో సినిమా గురించి ముచ్చటించారు.
పంచిబోరా మాట్లాడుతూ ``గతంలో ఊ కొడతారా ఉలిక్కి పడతారా, ఆకాశమే హద్దు, ఇది నాలుగో చిత్రం. ఎవరు చిత్రంలో యామినీ అనే పాత్ర చేశాను. స్లిపీంగ్ డిసార్డర్తో బాధపడే పాత్ర చేశాను. అంటే నేను ఎక్కువ సేపు నిద్రపోతుంటాను. నా చుట్టూ ఏ విషయాలు జరుగుతాయనే దాని గురించి పెద్దగా తెలియవు. అలాంటప్పుడు తారకరత్న ఆ సమస్య నుండి ఎలా కాపాడాడనేదే కథ. ముందు ఈ సినిమాకు యామినీ చంద్రశేఖర్ అనే టైటిల్ పెట్టారు. అయితే కారణాలు తెలియలేదు కానీ తర్వాత కథానుగుణంగా ఎవరు అనే టైటిల్ పెట్టారు. తారక్రత్న మంచి కోస్టార్. నటన పరంగా బాగా సపోర్ట్ చేశాడు. మంచి నటుడు. ఇదొక హర్రర్ చిత్రం. నా చుట్టూ జరిగేదంతా ఆడియెన్స్కు థ్రిల్లింగ్ను కలిగిస్తుంది. నటిగా నాకు కూడా మంచి అనుభూతినిస్తుంది. మంచి సక్సెస్ తెస్తుందని అనుకుంటున్నాను. 22యార్డ్స్ అనే హిందీ సినిమా చేస్తున్నాను. రమణ సాల్వ సినిమాను గ్రిప్పింగ్గా తెరకెక్కించారు. సినిమాను ఈ నెల 26న విడుదలవుతుంది. తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుంది`` అన్నారు.
Glam gallery from the event |
|
|
|