28 August 2015
Hyderabad
తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘పారా హుషార్’
ధృవ్ ప్రొడక్షన్స్ పతాకంపై సాయి సునీల్ నిమ్మల దర్శకత్వంలో ధృవ్ టాండేల్ నిర్మాతగా రూపొందిస్తోన్న చిత్రం ‘పారాహుషార్’. విజయ్, నేహా దేశ్ పాండే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. సాయి సునీల్ నిమ్మల మాట్లాడుతూ లవ్, క్రైమ్, కామెడి, థ్రిల్లర్ కాన్సెప్ట్ లతో ఈ సినిమా రూపొందుతోంది. కథ, కథనం చాలా కొత్తగా ఉంటాయని దర్శకుడు సాయిసునీల్ నిమ్మల అన్నారు. అన్నీ వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమాని రూపొందిస్తున్నామని, క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని రూపొందిస్తున్నాం. సినిమా చాలా బాగా వస్తుంది. సినిమా తొలి షెడ్యూల్ పూర్తయింది. సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని నిర్మాత ధృవ్ టాండేల్ అన్నారు.
విజయ్, నేహాదేశ్ పాండే హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో సూర్య, చిత్రంశీను, నల్లవేణు, అజయ్ ఘోష్ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ-మాటలు: సి.భీమేశ్వరఛారి, కెమెరా: డి.వెంకట్రాజు, సంగీతం: కిరణ్ వెన్న, పాటలు: కాసర్లశ్యామ్, ఆర్ట్: బాబ్జీ, నిర్మాత: ధృవ్ టాండేల్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సాయి సునీల్ నిమ్మల