22 September 2014
Hyderabad
శ్రీవెంకటసాయి ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై మహేష్, నరేష్, సురేష్ నిర్మిస్తున్న చిత్రం పవనిజం. ఈ చిత్రం ద్వారా వి.కె.చైతన్య దర్శకునిగా పరిచయం అవుతున్నారు. మధు, సుధీర్, ఇషా, జయంతి హీరోహీరోయిన్లుగా సుమన్, పోసాని, కాశీవిశ్వనాధ్, ఆలీ, సప్తగిరి తదితరులు ఇతరపాత్రల్లో నటిస్తున్నారు. పవన్ అభిమానులు తలుచుకుంటే సమాజాన్ని ఏ విధంగా మార్చగలరో తెలియజెప్పేదే చిత్ర కథాంశం. ఈ చిత్రంలో ఎంఎల్ఏ క్యారెక్టర్ చేస్తున్న పోసానికి మంచి పేరు తెచ్చేది. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు యు/ఎ సర్టిఫికెట్ జారీ చేశారు. సెన్సార్ సభ్యుల అభినందనలు అందుకున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకునే కథాంశంతో తయారవుతోంది. పవన్ కళ్యాణ్లోని సామాజిక స్ఫూర్తి ఆయన ఫ్యాన్స్ కు ఎలా ఉత్తేజం ఇస్తుందో…అలాంటి ఉత్సాహంతో సమాజానికి ఫ్యాన్స్ తలుచుకుంటే ఎలాంటి మంచి పనులు చేయవచ్చో తెలియజెప్పే కథాంశం ఈ చిత్రానికి హైలెట్ అని నిర్మాతలు తెలియజేశారు. ఈ చిత్రంలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నెల 26న అన్ని ప్రధాన కేంద్రాలలో రిలీజవుతున్న మూవీ పవనిజం. సంగీత దర్శకుడిగా కనిష్క అద్భుతమైన పాటలను అందించారు. ఆనంద్డోల సినిమాటోగ్రఫీ, సత్య ఎడిటింగ్ వహించారు. ఈ చిత్రానికి కథ-మాటలు-స్క్రీన్ప్లే-దర్శకత్వం : ఇ.కె.చైతన్య.