ఉత్తరాంధ్రకు చెందిన సుప్రసిద్ధ వ్యాపార సంస్థ 'గోటి సన్స్" సినిమా నిర్మాణ రంగంలోకి ప్రవేశిస్తూ నిర్మిస్తున్న చిత్రం "పిడుగు" తన తనయుడు "వినీత్"ను హీరోగా పరిచయం చేస్తూ.. గోటి సన్స్ అధినేత అశోక్ గోటి నిర్మిస్తున్న ఈ ఏక్షన్ ఎంటర్ టైనర్ ద్వారా రామ్ మోహన్ సి. హిచ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వినీత్ సరసన మోనికా సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నిన్నటి కథానాయకుడు వినోద్ కుమార్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసుకున్న ఈ చిత్రం టీజర్ ను.. కొత్త సంవత్సరంలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా "వి2 ఫిల్మ్స్" అధినేత అశోక్ గోటి మాట్లాడుతూ.... "సెన్సార్ మినహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మా "పిడుగు" చిత్రం ట్రైలర్ ను త్వరలో రిలీజ్ చేయనున్నాం. టీజర్ న్యూ ఇయర్ లో రిలీజ్ చేశాం అలాగే ఈ నెలాఖరుకు ఆడియో విడుదల చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నాం. మా అబ్బాయ్ సినిమా అని చెప్పడం కాదు కాని.. చూసినవారంతా.. సినిమా చాలా బాగుందని అంటున్నారు. వినీత్ పెర్ఫార్మెన్స్ కు చాలా మంచి రిపోర్ట్ వస్తోంది" అన్నారు.
బెనర్జీ, సంధ్యా జనక్, ప్రభావతి, ముక్తార్ ఖాన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్, సినిమాటోగ్రఫి: పి.ఎస్. ప్రకాష్, మ్యూజిక్: కార్తీక్ కుమార్, రీ-రికార్డింగ్: విజయ్ కూరాకుల, నిర్మాత; అశోక్ గోటి, కథ-స్క్రీన్ ప్లే-దర్సకత్వం: సి.హెచ్.రామ్ మోహన్!!