రిషి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సతీష్ బాబు, మెరీనా అబ్రహం జంటగా రాజు కుంపట్ల దర్శకత్వంలో జనార్ధన్ మందుముల నిర్మించిన చిత్రం ‘రొమాన్స్ విత్ ఫైనాన్స్’. ఈ సినిమా మార్చి 18న విడుదలవుతున్న సందర్భంగా సోమవారం చిత్రయూనిట్ హైదరాబాద్ లో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా...
దర్శకుడు రాజు కుంపట్ల మాట్లాడుతూ ‘’అందమైన ప్రేమ వెనుక దాగిఉన్న రొమాన్స్, దాని వెనుక దాగి ఉన్న ఫైన్సాన్స్ గురించి తెలియజేసే కథ. లవ్ స్టోరీతో ముడిపడి ఉంటుంది. అందరూ కొత్తవాళ్ళయినా చక్కగా నటించారు. అందరూ బాగా సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. సినిమా అవుట్ పుట్ చూశాం. తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది. పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాను మార్చి 18న విడుదల చేస్తున్నాం. సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
నిర్మాత జనార్ధన్ మందుముల మాట్లాడుతూ ‘’సినిమా రంగానికి నేను కొత్త. సినిమా బాగా వచ్చింది. పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరి సపోర్ట్ తో మంచి సినిమాను రూపొందించాం. ఈ నెల 18న విడుదలవుతున్న ఈ సినిమాను పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాం’’ అన్నారు.
కోప్రొడ్యూసర్ సుదర్శన్ సరికొండ మాట్లాడుతూ ‘’జాన్ పోట్ల సంగీతంలో అల్రెడి విడుదలైన పాటలు పెద్ద హిట్టయ్యాయి. సినిమాను కూడా పెద్ద హిట్ చేయాలని ప్రేక్షకులను కోరుతున్నాం’’ అన్నారు.
హీరో సతీష్ మాట్లాడుతూ ‘’దర్శకుడు, నిర్మాతల సహకారంతో మంచి సినిమాను రూపొందించాం. కమర్షియల్ సినిమాకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఈ నెల 18న విడుదలవుతున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాం’’ అన్నారు.
ఈ కార్యక్రంలో హీరోయిన్ మెరీనా అబ్రహం, మ్యూజిక్ జాన్ పోట్ల తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి సాహిత్యం: సురేష్ గంగుల, బాలకృష్ణ, కెమెరా: మురళి, ఆర్ట్: సత్యశ్రీనివాస్, ఎడిటర్: క్రాంతి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవి మేకల, కో ప్రొడ్యూసర్: సుదర్శన్ సరికొండ, నిర్మాత: జనార్ధన్ మందుముల, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: రాజు కుంపట్ల.