1 January 2016
Hyderabad
టాకీపార్ట్ పూర్తి చేసుకున్న 'పృథ్వీదత్తా..ఓ పరిచయం'
అల్లు వంశ్, ప్రియాంక అగస్త్యన్ జంటగా...డబ్యూడబ్యూడబ్యూ మూవీస్ పతాకంపై దర్శకనిర్మాత పృథ్వీదత్తా నిర్మిస్తున్న చిత్రం ''పృథ్వీదత్తా..ఓ పరిచయం''. టాకీపార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా దర్శకనిర్మాత పృథ్వీదత్తా మాట్లాడుతూ..' ఇది ఒక రొమాంటిక్ లవ్స్టోరీ. ఈ చిత్రంలో అద్భుతమైన పాటలుంటాయి. సంగీతం, కెమెరాల పనితనం హైలైట్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాము. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనవరి 5 కి పూర్తవుతాయి. వెంటనే సినిమాని సెన్సార్కి పంపించనున్నాము. సెన్సార్ అనంతరం రిలీజ్ డేట్ ప్రకటిస్తాము. ఈ చిత్రం మాకు తప్పకుండా మంచి పేరు తెచ్చే చిత్రమవుతుందని ఆశిస్తున్నాము.
అల్లు వంశ్, ప్రియాంక అగస్త్యన్, అనిరుధ్ తాళ్ళురి, శిరీష, ఆదిమల్ల అశోక్, శృతివైజాగ్, రామకృష్ణ అల్లు, ఈ రోజుల్లో చిత్ర ఫేమ్ వెంకీ, జిఎమ్ఆర్ సరోజ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: నాగిరెడ్డి, ఎడిటర్: శ్రీనివాస్, సంగీతం: లక్ష్మీవినాయక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: తాడిపత్రి వెంకటేష్, కథ-మాటలు-దర్శకత్వం-నిర్మాత: పృథ్వీదత్తా చింతల.