pizza
Puri Jagannath's Jyothi Lakshmi movie launch on 20 February
You are at idlebrain.com > news today >
Follow Us

04 February 2015
Hyderabad

ఫిబ్రవరి 20న ‘జ్యోతి లక్ష్మి’ ప్రారంభం

ఛార్మి కౌర్ సమర్పణలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌, శ్రీశుభశ్వేత ఫిలింస్‌ పతాకాలపై పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘జ్యోతిలక్ష్మీ’ పేరుతో ఓ చిత్రం ప్రారంభం కాబోతోంది. ఈ చిత్రం షూటింగ్‌ ఫిబ్రవరి 20 స్టార్ట్‌ అవుతోంది. ఈ చిత్రంలో టైటిల్‌ పాత్రను ఛార్మి పోషిస్తోంది. ఈ వివరాలను బుధవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగిన ‘పిశాచి’ ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమంలో నిర్మాత సి.కళ్యాణ్‌, దర్శకుడు పూరి జగన్నాథ్‌ తెలిపారు. ఈ చిత్రం తర్వాత పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లోనే వరుణ్‌తేజ్‌ హీరోగా మరో చిత్రాన్ని ప్రారంభిస్తున్నట్టు నిర్మాత సి.కళ్యాణ్‌ చెప్పారు.

ఛార్మి కౌర్‌, సత్య, వంశీ ప్రధాన పాత్రల్లో రూపొందనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పి.జి.వింద, సంగీతం: సునీల్‌ కశ్యప్‌, నిర్మాతలు శ్వేతలానా, వరుణ్‌, తేజ, సి.వి.రావు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved